రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ మున్సిపాలిటీకి రూ.320 కోట్లు కేటాయించిందని, ఇందులో రూ.225 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, రూ.95.50 కోట్లు నీటి సరఫరాకు వినియోగించనున్నట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. రిమ్స్లో 40 మంది ఫ్రొఫెసర్లు, 63 మంది అసిస్టెంట్ ఫ్రొఫెసర్లను ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. అనంతరం బల్దియాకు నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కౌన్సిలర్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
– ఆదిలాబాద్, మే 25(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఆదిలాబాద్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. గురు వారం ఆదిలాబాద్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మించినట్లు తెలిపారు. రిమ్స్లో వివిధ విభాగా లకు చెందిన 40 మంది ఫ్రొఫెసర్లతో పాటు, 63 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను ప్రభుత్వం నియ మించినట్లు తెలిపారు. వీరి నియామకంతో పేదలకు అన్ని రకాల వైద్యసేవలు అందుతాయని తెలిపారు.
ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ప్రభుత్వం రూ.320 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వివిధ వార్డుల్లో రూ. 225 కోట్లతో అండర్ డ్రైనేజీ పనులు, రూ. 95.50 కోట్లతో నీటి సరఫరా పనులను చేపట్టను న్నట్లు తెలిపారు. నిధులతో వార్డుల్లో పారిశుధ్యం మెరుగుపడడంతో పాటు, ప్రజలకు మంచినీటిని ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తామని పేర్కొ న్నారు. మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మన్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కౌన్సిలర్లు పాలాభిషేకం చేశారు. జైనథ్ ఎంపీపీ గోవర్ధన్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, అలాల అజయ్, ప్రకాశ్, నాయకులు మెట్టు ప్రహ్లాద్, సాజిదుద్దీన్, రాజ్కుమార్, లస్మన్న పాల్గొన్నారు.
ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేయాలి
ఎదులాపురం,మే 25 : ప్రపంచ శాంతి కోసం హజ్ యాత్ర సందర్భంగా ప్రార్థనలు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న హజ్ యాత్రకు వెళ్తున్న యాత్రికులను కోరారు. జిల్లా నుంచి ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్తున్న యాత్రి కులకు గురువారం స్థానిక టీఎన్జీవో భవనంలో వ్యాక్సిన్ వేశారు. ఎమ్మెల్యే హాజరై ఈ కార్యక్ర మాన్ని ప్రారంభించారు. అంతకు ముందు జిల్లా హజ్ సొసైటీ తరఫున ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి ,మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు షాహిద్ హైమాద్, సభ్యులు ఆసిఫ్ ఉద్దీన్, హసీబ్, నూర్ ఖాన్, ఫారూఖ్, తదిత రులు పాల్గొన్నారు.