ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 8: విభజించి పాలించే పార్టీలను తరిమి కొట్టాలని, సర్వ మ తాలు, అన్ని కుల సంఘాలను ఏకతాటిపై నడిపించే బీఆర్ఎస్నే ఆదరించాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్గూడ గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. మున్నూరుకాపు సంఘం భవనం ఏర్పాటుకు గ్రామస్తులతో కలిసి భూమి పూజ చే శారు.
అనంతరం మార్కండేయ ఆలయంలో షె డ్ల నిర్మాణంతోపాటు శ్మశానవాటికకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంతకుముందు గ్రామస్తు లు ఎమ్మెల్యే జోగు రామన్నకు డప్పు చప్పుళ్ల మ ధ్య మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామ స్వ రాజ్యం వచ్చిందని తెలిపారు. ప్రతి పల్లె, పట్టణం తన రూపురేఖలు మార్చుకుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గండ్ర త్ రమేశ్, సర్పంచ్ గంగారాం, ఉప సర్పంచ్ జయంత్, అధికార ప్రతినిధి గంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు కుమ్ర రాజు, నగేశ్, నారాయణ పటేల్, కృష్ణయ్య, గంగారెడ్డి, సాజీదొద్దీన్ పాల్గొన్నారు.
దేవాలయాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
జైనథ్, అక్టోబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం కులమతాలకతీతంగా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. కరంజి గ్రామంలో రూ.40 లక్షలతో వేంకటేశ్వర స్వామి కల్యాణ మండపం, రూ.50 లక్షల నిధులతో శ్రీరామ మందిరం కల్యాణ మండపం నిర్మాణానికి నిధులు మంజూరు కాగా ఆదివారం శిలఫలాకాన్ని ఆవిష్కరించారు. జామిని గ్రామంలో రూ.18 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తుమ్మల వెంక ట్ రెడ్డి, సర్పంచులు మోహన్, రతన్ రెడ్డి, పెం దూర్ దేవన్న, తనాజీ, భరత్, జగన్నాథ్ పాల్గొన్నారు.
అలసిపోయాం..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్ గూడ గ్రామంలో గొర్రెల మంద ఓ చెట్టు కింద సేద తీరుతున్న దృశ్యం ఆదివారం కనిపించింది. ఉదయం నుంచి మేత వేటలో ఉన్న మేకల మంద మధ్యాహ్నం చెట్టు కింద నీడ కనబడడంతో అక్కడ సేదతీరింది.
-ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్, అక్టోబర్ 8