నేరడిగొండ, జనవరి 30 : కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు భరోసా ఉండేదని, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మ కం పోయిందని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పథకాలు తప్పకుండా వస్తాయనే నమ్మకం ఉండేదని తెలిపారు.
కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవుతున్నా.. రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలు అమలు కాకపోవడంపై మండిపడ్డారు. సాధ్యమైన హామీలనే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, స్థానిక సర్పం చ్ పెంట వెంకటరమణ, సర్పంచ్లు జంగు, జాదవ్ రమేశ్, తహసీల్దార్ సంతోష్రెడ్డి, ఆర్ఐ నాగోరావ్, నాయకులు పాల్గొన్నారు.