కాసిపేట, డిసెంబర్ 24 : సింగరేణి ఓపెన్ కాస్ట్ నిర్వాసిత గ్రామమైన దుబ్బగూడెం ఆర్అండ్ఆర్ కాలనీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. ఆదివారం కాసిపేట మండలంలోని దుబ్బగూడెం గ్రామానికి చెందిన ఆర్అండ్ఆర్ కాలనీ పనులు పెద్దనపల్లి బైపాస్ రోడ్డు వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరిశీలించారు.
ఓసీలో దుబ్బగూడెం గ్రామం నష్టపోతుండగా వారికి పెద్దనపల్లి శివారు బైపాస్ రోడ్డు ఆర్అండ్ఆర్ కాలనీ ఏర్పాటు పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రత్నం ప్రదీప్, గ్రామస్తులు బోగె రామకృష్ణ, శ్రీనివాస్, కమలాకర్, పులి శ్రీనివాస్, రాంటెంకి రాజు, టింకు, మహేశ్ తదితరులున్నారు.