దండేపల్లి, అక్టోబర్11: మాయమాటలు నమ్మి మోసపోతే గోసపడాల్సి వస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలం కొత్తమామిడిపెల్లి జీపీ పరిధిలోని మామిడిగూడ, దమ్మన్నపేట, పాత మామిడిపెల్లి జీపీ పరిధిలోని ఊట్లగూడెం కర్ణపేట జీపీ పరిధిలోని సామగూడెం, చెల్కగూడెం జీపీ పరిధిలోని ఇప్పలగూడెం గిరిజన గూడేల్లో స్థానిక నాయకులతో కలిసి బుధవారం పర్యటించారు. ఇం టింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మె ల్యే దివాకర్రావు మాట్లాడుతూ పనిచేసే నాయకులను, ప్రభుత్వాన్ని మరింత ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో రానున్నది కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారే అన్నారు. మంచిర్యాల గడ్డపై గులాబీ జెండా మరోసారి ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కారు గుర్తుకు ఓటెయ్యాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనిల్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులున్నారు.