బోథ్, డిసెంబర్ 8 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని నిగిని అటవీ ప్రాంతంలోని కైలాస్ టెక్డీలో కొలువైన మహాదేవునికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆ మహాదేవున్ని ప్రార్థించారు.
బోథ్ ప్రజలు సుఖఃశాంతులతో, అష్టఐశ్వర్యాలతో, పంట పొలాలు పచ్చగా ఉండాలని వేడుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఆలయం వద్ద శ్రీకృష్ణ హాస్పిటల్ డాక్టర్ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించి ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.