ఆసిఫాబాద్ టౌన్/నస్పూర్, ఫిబ్రవరి 3: గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ (సీతక) అన్నారు. ములుగు కలెక్టరేట్ నుంచి వీసీ ద్వా రా హైదరాబాద్ నుంచి ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ, గ్రా మీణాభివృద్ధి అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో గ్రామపంచాయతీల అభివృద్ధిపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించా రు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేకాధికారుల పా లన ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రానున్న వేసవి లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసిఫాబాద్లో కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీపీవో ఉమర్ హుస్సేన్, డీఆర్డీవో సురేందర్ కలిసి పాల్గొన్నారు. ఆసిఫాబాద్క లెక్టర్ మా ట్లాడుతూ అన్ని గ్రామాలకు ప్రత్యేకాధికారులను నియమించామ ని తెలిపారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంచిర్యాలలో కలెక్టర్ బదావత్ సంతో ష్, అదనపు కలెక్టర్ రాహుల్, డీపీవో, డీఆర్డీవో ఉన్నారు.