దిలావర్పూర్, అక్టోబర్ 4 : మంత్రి కేటీఆర్ను మండలంలోని గుండంపల్లి, దిలావర్పూర్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కలిశారు. నాగలిని బహూకరించి, డ్రాగన్ ఫ్రూట్ అందించారు. తమ గ్రామ పరిసర ప్రాంతంలోని ఇథనాల్ పరిశ్రమను వేరే ప్రాంతాలకు తరలించాలని, దిలావర్పూర్ జాతీయ రహదారి నుంచి గుండంపల్లి ప్యాకేజీ-27 వరకు బీటీ రోడ్డు, గుండంపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ కళ్యాణ మండప నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్షర, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు డాక్టర్ సుభాష్రావు, సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు కొమ్ముల దేవేందర్రెడ్డి, ఏలాల చిన్నరెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కోడే రాజేశ్వర్, పాల్దే అనీల్, పాల్దే శ్రీనివాస్, పూజారం మహేశ్, కోడే నవీన్, దనే రవి, సప్పల రవి, గుణవంతురావు, గంగారెడ్డి తదితరులు ఉన్నారు.