ఎదులాపురం, మే 10 : ఆదిలాబాద్ పట్టణ పరిధిలో రూ.55 కోట్లతో నూతన కలెక్టరేట్, రూ.40 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణ భూమిపూజకు మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో రూ.2.20కోట్లతో నిర్మించనున్న ఆర్అండ్బీ అతిథిగృహం భవనానికి బుధవారం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. గతంలో బండారిగూడ, అనుకుంట గ్రామా ల సమీపంలో లో లెవల్ బ్రిడ్జీలతో వర్షాకాలంలో అటువైపు ఉన్న పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పాటు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తుచేశారు. కారు గుర్తు ప్రభుత్వం వచ్చిన తర్వాతే విశాలమైన రోడ్లు, వంతెనలు నిర్మించినట్లు చెప్పారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారన్నారు.
68 యేండ్లలో ఏ ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదన్నారు. ఇప్పటికే గడిచిన తొమ్మిదేండ్లలో ఎన్నో వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు, పనులు నిర్వహించామని తెలిపారు. గత ప్రభుత్వాల హ యాంలో విద్యార్థులు, ప్రజలు రోడ్లు, బ్రిడ్జిలు లేక పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతమని ఆదిలాబాద్ ఎ మ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఆర్అండ్బీ ఈఈ నర్సయ్య, డీఈ రాథోడ్ సురేశ్, ఏఈఈ నరేశ్, వార్డు కౌన్సిలర్ క లాల శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు అలాల్ అజయ్, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, నాయకులు రాంకుమార్, శైలేందర్, దాసరి రమేశ్, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు.
కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు
జైనథ్, మే 10 : ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రజల ఏళ్లనాటి కలలను సాకారం చేస్తూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నన్నట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. మండలంలోని ఉమ్రి వద్ద రూ.3.20 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జైనథ్, బేల మండలాలను కలుపుతూ కాఫ్రి, మణియార్పూర్, బేల, జామిని, పెన్గంగ మీదుగా రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణానికి రూ.46.68 లక్షలతో పనులు పూర్తి చేశామన్నారు. గతంలో రూ.కోటి జిల్లాకు వస్తే డప్పు చాటించే వారన్నారు.
గడిచిన తొమ్మిదేండ్లలో రూ.5 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర లోయర్ పెన్గంగపై చనాకా-కొరాట ప్రాజెక్టును పూర్తి చేసి బేల, జైనథ్, ఆదిలాబాద్ మండలాల్లోని రైతులకు 50వేల ఎకరాలకు సాగు నీరందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, నాయకులు సతీశ్పవార్, గంభీర్ ఠాక్రే, ఆర్అండ్బీ డీఈ సురేశ్ రాథోడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రహ్లాద్, గొడం సునీల్, రాంరెడ్డి, గంగన్న, ఈరన్న తదతరులు పాల్గొన్నారు.
అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట
ఆదిలాబాద్ రూరల్, మే 10 : అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చిట్యాలబోరి గ్రామంలో ఇటీవల మృతి చెందిన రైతు ఆడె ముత్యాలు కుటుంబ సభ్యులకు రైతు బీమా పథకం కింద మంజూరైన రూ.5 లక్షల విలువైన చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. అన్నదాతల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతూ బృహత్ పథకాలకు శ్రీకారం చుడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, రూరల్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, జైనథ్ ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, సర్పంచ్ కుమ్ర లక్ష్మి-వసంత్రావ్, మెట్టు ప్రహ్లాద్, పరమేశ్వర్ పాల్గొన్నారు.