సారంగాపూర్, ఏప్రిల్ 26 : రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల కరెంట్, రైతు బీమా, రైతుబంధు, పంటలకు గిట్టుబాటు ధర, సబ్సిడీ కింద ఎరువులు, విత్తనాలు వంటి బృహత్తర పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ప్రభుత్వం రైతులకు ఆయిల్పామ్ మొక్కలను సరఫరా చేస్తున్నదని, అందుకోసం డిప్ ఇరిగేషన్ కోసం ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం కింద సబ్సిడీ, ఇతర కులాల వారికి 80శాతం సబ్సిడీ ఇస్తున్నదని తెలిపారు. రాష్ట్ర సర్కారు ధాన్యం కొనుగోలు చేస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం కొనలేమని చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే అడ్డంకులు వేస్తున్నదని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీకి రైతులే తగిన బుద్ధిచెప్తారన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, వైస్ ఎంపీపీ పతాని రాధ, ఆలూర్ సొసైటీ చైర్మన్ ఎలిపెద్ది మానిక్రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రవీందర్రెడ్డి, మార్కెటింగ్ డీఎం అశ్వక్, డీఎస్వో తనూజ, తహసీల్దార్ సంతోష్రెడ్డి, నాయకులు దండుసాయికృష్ణ, జీవన్రావు, పతాని భూమేశ్, రాజేశ్వర్రెడ్డి, సాగర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో వంద మంది చేరిక..
నిర్మల్ అర్బన్/సోన్, ఏప్రిల్ 26 : సోన్ మండలం గంజాల్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సుమారు వంద మంది మంత్రి అల్లోల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ మోహినొద్దీన్ ఆధ్వర్యంలో గంజాల్ నుంచి మంత్రి నివాసం వరకు ర్యాలీగా వచ్చారు. వారికి ఐకే రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు, అన్ని రంగాల్లో అభివృద్ధిపర్చిన బీఆర్ఎస్ పార్టీపైనే ప్రజలకు విశ్వాసం ఉన్నదన్నారు. అందుకే చాలా మంది పార్టీకి ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుత పరిస్థితులతో పాటు, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకా లు అమలుచేస్తున్నారన్నారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హా మీలను సైతం అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నా రు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అ మలువుతున్నాయని స్పష్టం చేశారు. అందుకే దేశం మొత్తం కేసీఆర్ పాలననున కోరుకుంటున్నారన్నారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని చెప్పారు. కార్యకర్తలే పార్టీకి కొండంత బలమని, వారికి పార్టీలో పూర్తి గౌరవం ఉంటుందన్నారు. కష్టపడి పార్టీ బలోపేతానికి కృషిచేసేవారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, గంజాల్ మాజీ ఎంపీటీసీ మల్లయ్య, నాయకులు రాంకిషన్ రెడ్డి, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ..
పట్టణంలోని గాజుల్పేట్ కాలనీలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పర్స లక్ష్మి, పర్స భూమేశ్ల రెండు ఇండ్లు కాలిపోయాయి. కాగా, బాధిత కుటుంబాలకు మంత్రి అల్లోల పరామర్శించారు. అన్ని విధాలా అదుకుంటామని భరోసా కల్పించారు. తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.95 వేలు అందించారు. నెలలోపు రూ.3 లక్షలతో ఇండ్లను నిర్మిస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. అనంతరం 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. అలాగే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోరును ప్రారంభించారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్లు ఎస్పీ రాజు, చాహుస్ నాయకులు తదితరులున్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
నిర్మల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి క్యాంపు కార్యాలయంలో అల్లోల పంపిణీ చేశారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. ఇక్కడ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, కౌన్సిలర్లు అడ్ప విజయలక్ష్మీపోశెట్టి, వేణు తదితరులున్నారు.
ఆలయంలో పూజలు..
సోన్, ఏప్రిల్ 26 : సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం మంత్రి అల్లోల హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేవాలయాల నిర్మాణంతో గ్రామాల్లో ఆధ్యాత్మికత పెరిగిందన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు బాధిత గ్రామంలో వెల్మల్ ఒకటని, వేంకటేశ్వరస్వామి ఆలయం చాలా పురాతనమైనదని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ నిధులు రూ.36 లక్షలు వెచ్చించినట్లు చెప్పారు. రూ.1200 కోట్లతో 400కేవీ సబ్స్టేషన్, రూ.30లక్షలతో సాయిబాబా, పోచమ్మ ఆలయాలను నిర్మించుకున్నట్లు తెలిపారు. సర్పంచ్ అంకం గంగామణి శ్రీనివాస్, తహసీల్దార్ హిమబింధు, ఎంపీడీవో ఉషారాణి, నాయకులు మధనంతరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.