సారంగాపూర్, మే 23 : నిర్మల్ జిల్లా కేంద్రం లో వాహన పరిశీలన కేంద్రం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సారంగాపూర్ చించోలి (బీ) గ్రామ సమీపంలో నేషనల్హైవే రహదారి పక్కన రూ. 3.50 కోట్లతో నూతనంగా నిర్మించిన జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ దండే విఠల్ కలిసి మంత్రి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో మంత్రి మాట్లాడారు. వాహనాలు ఎక్కు వగా దృష్ట్యా వెహికిల్ టెస్టు సెంటర్, హేవీ వెహి కిల్ డ్రైవింగ్ టెస్టు ఏర్పాటు విషయాన్ని ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తానన్నారు. చాలా ప్రాంతాల్లో వాహనాలు ఎక్కువగా నడు స్తున్న సందర్భంగా పొగ వ్యాపించి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని, మన అదిలాబాద్ జిల్లా అడవులతో నిండి ఉండడం వల్ల పొగతో ప్రజలకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటా యని పేర్కొన్నారు. వాహనాలు నడిపే వారు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగితే కఠిన శిక్షలు ఉంటాయని, మన దేశంలో మాత్రం ప్రమాదానికి కారణమైన వారు వెంటనే బయటకు వస్తారన్నారు. చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే వాహనదారులు ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ ను చేయించుకోవాలని సూచించారు. తెలంగాణ లోనే నిర్మల్ జిల్లాలో మొట్టమెదటి అందమైన రవాణాశాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకో వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్ర మం లో నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి అజయ్కుమార్, ఆర్డీవో స్రవంతి, రైతు బంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, నిర్మల్ మున్సిపాల్ చైర్మన్ ఈశ్వర్, సర్పంచ్ చాట్ల లక్ష్మి, ఎంపీటీసీ వెంకట్మ్రణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, అడెల్లి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిటి చందు, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, కాంట్రాక్టర్ లక్కాడి జగన్మోహన్రెడ్డి, ఎంపీడీవో సరోజ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు
నిర్మల్ అర్బన్/దిలావర్పూర్, మే 23 : వన్య ప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తు న్నదని, అటవీ జంతువులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో వన్యప్రాణుల వల్ల పశువులు, గొర్రెలు మృతి చెందడంతో ప్రభుత్వం నుంచి మంజూరైన నష్టపరిహార చెక్కులను మంగళవారం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో బాధితులకు మంత్రి అందించారు. సారంగాపూర్ మండలం ఇప్పచెల్మ గ్రామానికి చెందిన గెడాం కాన్బరావ్కు రూ.39 వేల చెక్కు, దిలావర్పూర్ మండలం న్యూ లోలం వాసి మోహన్కు రూ.25 వేల చెక్కును అందజే శారు. కార్యక్రమంలో ఎఫ్డీపీటీ శర్వానన్, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్ హెరామత్, ఎఫ్ఆర్వో జైపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, నాయకులు రాంకిషన్ రెడ్డి, వెంకట్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరి, మక్క కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయండి
నిర్మల్ టౌన్, మే 23 : నిర్మల్ జిల్లాలో మక్క, వరి కొనుగోళ్ల పక్రియను వేగంగా పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో వరి, మక్క కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డితో సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 150 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 5లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం సేకరణ పూర్తి చేశామని తెలిపారు. ఇందులో నాలుగు లక్షల క్వింటాళ్ల వరిధాన్యాన్ని రైస్మిల్లర్లకు తరలించామని పేర్కొ న్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యం లో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి, మక్క కొనుగోళ్లను వెంట వెంటనే తూకం చేసి రైస్ మిల్లులు, గోదాములకు తరలించా లన్నారు. లారీ యజమానులు ధాన్యం తరలింపులో సహకరిం చాలని కోరారు. రైస్ మిల్లర్ల వద్ద లోడింగ్ ప్రక్రియను వేగంగా చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇక నుంచి ప్రతిరోజూ కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెడుతామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్బాబు, డీఎస్వో తనూజ, డీఎం శ్రీకళ, డీసీవో శ్రీనివాస్ రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, రైస్ మిల్లర్లు, లారీ అసోసియేషన్ సంఘ నాయకులు పాల్గొన్నారు.