నిర్మల్ టౌన్/నిర్మల్ అర్బన్, జూన్ 1 : సమీకృత కలెక్టరేట్తో పరిపాలన మరింత సులభమవుతుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవ పనులను మంత్రి గురువారం పరిశీలించారు. ఈనెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త కలెక్టరేట్ను ప్రారంభిస్తారని చెప్పారు. దాదాపు రూ. 56కోట్లతో ఈ భవనం నిర్మించినట్లు తెలిపారు. జిల్లాకు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ఎల్ల పెల్లి శివారులోని క్రషర్ రోడ్డులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. బహిరంగ సభ వేదిక, పార్కింగ్, హెలీప్యాడ్ ప్రాంతాల్లో ఏర్పా ట్లపై అధికారులకు సూచనలు చేశారు. భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో చర్చించారు. సభ ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, జిల్లా ఎస్పీ ప్రవీణ్కుమార్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, నాయకులు రాంకిషన్ రెడ్డి, అల్లోల గౌతం రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మామడ, జూన్1 : స్వరాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర అటవీ,న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని గాయిద్పెల్లిలో రూ.10లక్షలతో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల గురువారం శిలఫలాకాన్ని ఆవిష్కరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. అన్ని గ్రామాల్లో నూతన ఆలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రైతు బంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాథోడ్ రాందాస్, ఎంపీపీ రాథోడ్ అమృత, జడ్పీటీసీ రాథోడ్ సోనియా, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ పాకాల చంద్రశేఖర్గౌడ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కే గంగారెడ్డి, తహసీల్దార్ ఆరిఫా, ఎంపీడీవో గోవర్ధన్, నాయకులు నల్ల లింగారెడ్డి, సుభాష్రావు, రాంచందర్ ఉన్నారు.