దిలావర్పూర్, మార్చి 17 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో దేవాదాయ శాఖ నిధులు రూ. 15 లక్షలతో నిర్మించిన బీరప్ప, మల్లన్న ఆలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ జిల్లాను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి గ్రామంలో అడిగిన వెంటనే ఆలయాలకు నిధులు మంజూరు చేస్తున్నామని అన్నారు.
గుండంపల్లి గ్రామంలో ఇటీవల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించామని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేశామని అన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భోజన్న ఎంపీపీ అక్షర, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్రెడ్డి, జడ్పీటీసీ రమణారెడ్డి, నాయకులు చిన్నారెడ్డి, తిరుపతిరెడ్డి, అనిల్, తహసీల్దార్ కరీం, ఎంపీడీవో మోహన్రెడ్డి, ఎంపీవో అజీజ్ఖాన్, ఏవో స్రవంతి, ఏఈవో శ్రీవాణి, పీఆర్ఏఈ శివకృష్ణ, దేవాదాయ శాఖ ఏఈ రామరావు, మిషన్ భగీరథ ఏఈ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి స్వాతి, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.
మూటాపూర్లో వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన
సోన్, మార్చి 17 : నిర్మల్ మండలం మూటాపూర్ గ్రామంలో నిర్మించిన వేంకటేశ్వర స్వామి పంచకుండాత్మక పంచాహ్నిక ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రతిష్ఠించిన విగ్రహాలకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి గ్రామస్తులు పురోహితుల సమక్షంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. నిర్మల్ నియోజకవర్గంలో 900 కొత్త ఆలయాలు నిర్మించామని తెలిపారు. గ్రామానికి చెందిన సత్యంరెడ్డి, రవీందర్రెడ్డిని మంత్రి ప్రత్యేకంగా అభినందించి శాలువాలతో సన్మానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అల్లోల కుటుంబ సభ్యులు మురళీధర్రెడ్డి వినోదమ్మ, అల్లోల సురేందర్రెడ్డి, ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రెడ్డి, జడ్పీ కో అప్షన్ సభ్యులు సుభాష్రావ్, మూటాపూర్ పీఏసీఎస్ చైర్మన్ గంగాధర్, వైస్చైర్మన్ రాజారెడ్డి, సర్పంచ్ అర్చనాగంగన్న, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు పాకాల రాంచందర్, మహేశ్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం
మామడ, మార్చి 17 : మండలంలోని పరిమండల్ గ్రామంలో రూ.60 లక్షలతో పునర్నిర్మించిన రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఆలయాల అభివృద్థికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్రెడ్డి, సర్పంచ్ నాగమణి దశరథ్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ హరీశ్రావు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్గౌడ్, వైస్ఎంపీపీ లింగారెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, నాయకులు జైసింగ్, రమణారెడ్డి, భాస్కర్రావు, అన్వర్, వికాస్, తదితరులు పాల్గొన్నారు.
క్షయ నిర్మూలనకు కృషి చేయాలి
నిర్మల్ చైన్గేట్, మార్చి17 : క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, వైద్యాధికారులు క్షయ వ్యాధిగ్రస్తులకు నిక్షయ మిత్ర ద్వారా న్యూట్రిషన్ కిట్ అందించేందుకు సహకారం అందించాలని మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి రాజేందర్, క్షయ నివారణ అధికారి డాక్టర్ రవీందర్రెడ్డి, సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్ శ్రీనివాస్, రవికిరణ్ పాల్గొన్నారు.
రైతులకు అందుబాటులో ఉండి సేవ చేయాలి
సోన్, మార్చి 17 : రైతులకు అందుబాటులో ఉండి సేవ చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ మండలం మూటాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని సందర్శించారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ బొండ్ల గంగాధర్తో పాటు కార్యవర్గ సభ్యులను సన్మానించారు. మూటాపూర్ పీఏసీఎస్ పరిధిలోని రైతులకు అవసరమైన సేవలను అందించి వారికి వెన్నుదన్నుగా ఉండాలని పాలకవర్గ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రెడ్డి, సర్పంచ్ అర్చన, తదితరులు పాల్గొన్నారు.