నిర్మల్ అర్బన్, డిసెంబర్ 21: అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్లోని రెడ్డి ఫంక్షన్హాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున పేద క్రిస్టియన్లలకు గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి అల్లోల బుధవారం ప్రారంభించారు. క్రిస్టియన్లకు గిఫ్ట్ప్యాక్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలు పండుగలను సంతోషంగా జరుపుకోవానే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
అన్ని పండుగలకు సమాన ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. అనంతరం ప్రభుత్వం తరఫున విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఆర్డీవో స్రవంతి, డీఎస్పీ జీవన్రెడ్డి, తహసీల్దార్ సుభాష్, కౌన్సిలర్లు రవి, నాయకులు నర్సాగౌడ్, ఆయా చర్చిల ఫాస్టర్లు, నిర్వాహకులు పాల్గొన్నారు.