కవ్వాల్ అభయారణ్యాన్ని విడిచి మైదాన ప్రాంతానికి తరలివెళ్లే గిరిజనులకు అండగా ఉంటామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని రాంపూర్, మైసంపేట గ్రామాలకు చెందిన 142 కుటుంబాలకు పునరావాసం కింద ప్రొసీడింగ్ కాపీలు, పరిహారం చెక్కులు అందజేశారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అడవిని విడిచి వెళ్లేందుకు సహకరించిన గిరిజనులను అభినందించారు. మొదటి విడుత కింద ఎంపికైన పునరావాస గ్రామాల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని హామీనిచ్చారు.
కడెం, అక్టోబర్ 21: గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. కవ్వాల్ అభయారణ్యాన్ని విడిచేందుకు గిరిజనులు సహకరించడం భేష్ అన్నారు. మండలంలోని కొత్తమద్దిపడగ గ్రామ సమీపంలో రాంపూ ర్, మైసంపేట గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు శుక్రవారం పునరావాస చెక్కులు, ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2008 నుంచి గిరిజన గ్రామాల్లోని ప్రజలను మైదాన ప్రాంతాలకు తరలించాలనే లక్ష్యంతో అటవీశాఖ అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు. కానీ అప్పటి ప్రభుత్వాలు అటవీశాఖకు సహకరించకపోవడంతో అది వాయిదా పడుతూ వచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల సమస్యలు విని వారికి అండగా నిలవాలనే లక్ష్యంతో అటవీశాఖ అధికారులకు సహకరించి మైదాన ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల సహకారాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో 42వ టైగర్ జోన్గా ఏర్పాటు అయిన అనంతరం కడెం, జన్నారం మండలాల్లోని 26 గిరిజన గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించాలనే లక్ష్యంతో గ్రామాలను ఎంపిక చేశామని, మొదటి విడుత కింద కడెం మండలంలోని రాంపూర్, మైసంపేట గ్రామాల ప్రజలను కడెం మండలంలోని కొత్తమద్దిపడగ గ్రామానికి తరలిస్తున్నట్లు తెలిపారు. వీరికి ఇప్పటికే ఇళ్ల స్థలాలతో పాటు వ్యవసాయ భూములను కేటాయించామని, దానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు.
మొత్తం 142 కుటుంబాలకు గానూ 94 మందికి ఇండ్లు, వ్యవసాయ భూములు, 48 మందికి రూ.15 లక్షల పరిహారం అందించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. కొత్తమద్దిపడగ గ్రామంలో ఇండ్లు, నచ్చన్ఎల్లాపూర్ పంచాయతీ పరిధిలోని పెత్తార్పు సమీపంలో వ్యవసాయ భూములను కేటాయించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో గిరిజనులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేలా చ ర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఖానాపూర్ ఎమ్మె ల్యే రేఖానాయక్ మాట్లాడుతూ.. అనేక గిరిజన గ్రామాలకు రహదారులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గిరిజన గ్రామాలకు అటవీశాఖ అధికారులు రహదారుల కోసం అనుమతులివ్వాలని అధికారులను కోరారు. ముథో ల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి మాట్లాడుతూ.. ఖానాపూర్ నియోజకవర్గంలోనే అధిక గిరిజన గ్రామాలు ఉండడంతో కవ్వాల్ అభయారణ్యం కోసం గిరిజన గ్రామాలను మైదా న ప్రాంతాలకు తరలించేందుకు మంత్రి అల్లోల ఎంతో కృషి చేశారన్నారు.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ అధికారుల పనితీరు, కలెక్టర్ ముషారఫ్ అలీ చొరవతో గ్రామాలను తరలించే కార్యక్రమం నేటికి ఓ కొలిక్కి వచ్చిందని చెప్పారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మా ట్లాడుతూ.. రాంపూర్, మైసంపేట గ్రామాల ప్రజలను కొత్తమద్దిపడగ గ్రామ సమీపంలోకి తీసుకురావడంతో పాటు, పెత్తార్పు గ్రామ సమీపంలో వారికి వ్యవసాయ భూములను కేటాయించినట్లు చెప్పారు. ఇండ్ల నిర్మాణంతో పాటు, వారికి మౌళిక సదుపాయాలు కల్పిస్తామని గుర్తు చేశారు. అనంతరం అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు తిలకించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (ఐఎఫ్ఎస్) డొబ్రియాల్, లోకేశ్ చంద్రపర్గెన్ (ఐఎఫ్ఎస్), ఫీల్డ్ డైరెక్టర్ శరవణన్, జిల్లా అటవీశాఖ అధికారి సునీల్ హిరమత్, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్, ఆత్మ చైర్మన్ కానూరి సతీశ్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యు డు రఫీక్ హైమద్, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు జడ రాజమణి ఇందూర్, బొడ్డు గంగన్న, కుర్ర లక్ష్మి, ఎంపీటీసీ కట్ట శ్యాం సుందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, ఎఫ్డీవో కోటేశ్వర్రావు, ఎఫ్ఆర్వో అనిత, అటవీశాఖ అధికారులు, అయా గ్రామాలకు చెందిన సర్పంచులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.