నిర్మల్ అర్బన్, అక్టోబర్ 17: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ‘సెల్ఫీ విత్ కార్..ఓట్ ఫర్ ఐకేఆర్’ అంటూ వినూత్న ప్రచారానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. పార్టీ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ ప్రచారం కోసం వచ్చే వాహనం ముందు కార్యకర్తలు, నాయకులు, యువత, ప్రజలు సెల్ఫీ తీసుకొని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని సూచించారు. అనంతరం కారుతో సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రచారాన్ని ప్రారంభించారు.