‘ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సుపరిపాలన భారతదేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నది. మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ఏ రాష్ట్రంలో కూడా కావడం లేదు’ అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని మొండిగుట్ట గ్రామంలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేసే నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాడులు చేయిస్తున్నదని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ర్టానికి నిధులు ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని ఆరోపించారు. కాగా.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో ముథోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డి.. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మావల మండల కేంద్రం, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్గూడలో ఆదిలాబాద్ జిల్లా కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్, ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొని మాట్లాడారు.
– ఆదిలాబాద్, మార్చి 27(నమస్తే తెలంగాణ)
మామడ, మార్చి 27 : తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి మరీ ఏ ఇతర రాష్ర్టాల్లో జరగలేదని, ఇన్ని సంక్షేమ పథకాలు ఎక్కడా అమలు కావడం లేదని అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని మొండిగుట్ట గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. దళితబంధు కింద ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు అందిస్తూ.. దళితుల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూంలు అందించడంతోపాటు ఇంటి స్థలం ఉండి, ఇల్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తుందన్నారు. గిరిజన గ్రామాల్లో రోడ్డు నిర్మించడంతోపాటు నూతన పంచాయతీలు ఏర్పాటు చేసి గిరిజనుల అభివృద్ధికి అండగా నిలిచిందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకే కవితపై ఈడీ దాడులు
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాడులు చేయిస్తున్నదని మంత్రి విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ర్టానికి నిధులు ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతుండడంతో, రాష్ట్రంపై విషం చిమ్ముతుందన్నారు. రాష్ర్టానికి రావాల్సిన కేంద్రీయ విద్యాలయాలు, మెడికల్ కళాశాలను మంజూరు చేయకుండా అడ్డుకుంటున్నదని మండిపడ్డారు.
పంట నష్టానికి సంబంధించి ప్రతి రైతుకు నష్టపరిహారం అందించి బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. పాకాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళానికి విచ్చేసిన కార్యకర్తలకు అంబలి పంపిణీ చేశారు. గాయిద్పెల్లి మాజీ సర్పంచ్ వసంత్రావుతోపాటు పలువురు నాయకులు ఇతర పార్టీల నుంచి మంత్రి సమక్షంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళిధర్రెడ్డి, గౌతంరెడ్డి, రాంకిషన్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకట్మ్రణరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ హరీశ్కుమార్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్గౌడ్, నిర్మల్ మార్కెట్ చైర్మన్ చిలుక రమణ, వైఎస్ ఎంపీపీ లింగారెడ్డి, నవీన్రావు, రాందాస్, భాస్కర్, లింగారెడ్డి, సీతారాం, వికాస్రెడ్డి, సుభాష్రావు, భూషణ్రెడ్డి పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి
రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలి. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిపై ప్రజల్లో చైతన్యం కల్పించాలి. పార్టీ కోసం నిరంతరం కృషి చేసే వారికి అధినాయకత్వం అండగా ఉంటుంది.
– చంద్రశేఖర్గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, మామడ.
మహిళల అభ్యున్నతికి పెద్దపీట
మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. గత పాలకుల హయాంలో ప్రసవాలకు ఆస్పత్రికి వెళ్లాలంటేనే తిప్పలు అయ్యేది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గర్భిణులకు అమ్మ ఒడి వాహనంలో సురక్షితంగా ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. ప్రసవానంతరం కేసీఆర్ కిట్ అందించడంతోపాటు అదే వాహనంలో ఇంటి దగ్గర దించుతున్నారు. ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అందిస్తున్నారు.
– సోని, సోన్పేట్, మామడ మండలం.
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే గిరిజన గ్రామాల్లో అభివృద్ధి జరిగింది. గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో సమస్యలు తీరాయి. గిరిజనులకు రాజకీయాలలో అవకాశలు కూడా లభించాయి. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేశారు. వస్తాపూర్ గ్రామానికి రోడ్డు వేయించి గిరిజన సమస్యలు పరిష్కరించిన ఘనత మంత్రికే దక్కుతుంది.
– రాథోడ్ రాందాస్, సర్పంచ్, గాయిద్పెల్లి.
రైతుబంధు, రైతుబీమా దేశానికే ఆదర్శం..
రైతుబంధు, రైతుభీమా పథకాలు రైతులకు మేలు చేస్తున్నాయి. సాగుకు ఉచిత కరెంటు అందించడంతోపాటు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు తరలించి, మద్దతు ధర కల్పిస్తున్నది. అకస్మాత్తుగా రైతు మరణిస్తే ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు రైతుబీమా ద్వారా రూ.5 లక్షలు అందించి అదుకుంటున్నది.
– కాలగిరి గంగారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్, మామడ.