నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్కు చెందిన రాధిక-లింగన్నలకు అభిగ్న, అఖిల కవల కూతుళ్లు. పెద్ద కూతురైన అభిగ్నను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయికుమార్తో నవంబర్ 11, 2021న పెళ్లి చేశారు. రెండో కూతురైన అఖిలను నిజామాబాద్ జిల్లా అంకాపూర్కు చెందిన శివకుమార్కృష్ణకు ఇచ్చి 2022 మే 25న వివాహం చేశారు.
ఆరు నెలల్లోపే రెండు పెళ్లిళ్లు కావడంతో కల్యాణలక్ష్మి పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. గురువారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చేతుల మీదుగా ఒకేసారి ఇద్దరు కూతుళ్లకు చెందిన చెక్కులను తల్లి రాధిక అందుకుంది. రెండు చెక్కు(రూ.2,00,232) లను చూపిస్తూ ఆనందం వ్యక్తం చేసింది.
– నిర్మల్ టౌన్, మే 4