ఇంద్రవెల్లి, జనవరి 20 : పవిత్ర గంగాజలంతో మర్రిచెట్ల వద్ద కుటుంబసమేతంగా బసచేస్తున్న మెస్రం వంశీయులు గురువారం రాత్రి సంప్రదాయం ప్రకారం 84 మంది పేరిట తుమ్ పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయుల్లో చనిపోయిన వారి పేరిట ప్రతి సంవత్సరం నాగోబా జాతర సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారని మెస్రం వంశ పెద్దలు శుక్రవారం తెలిపారు. తుమ్ పూజల తర్వాత మర్రిచెట్లకు కొద్ది దూరంలో అర్ధరాత్రి పతిభగవాన్ పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సామూహికంగా వంటలు చేస్తూ సహపంక్తి భోజనాలు చేస్తున్నారు.
మర్రి చెట్ల నుంచే నాగోబాకు ప్రత్యేక పూజలు చేస్తూ నైవేద్యాలను సమర్పించి దీపాలు వెలిగించారు. మర్రిచెట్ల ప్రాంతంలోకి వచ్చిన ఎడ్లబండ్లకు మెస్రం వంశీయులు సర్వేలు చేయగా.. 265 ఎడ్లబండ్లు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, బాజీరావ్పటేల్, లింబారావ్పటేల్, కోసు కటోడ, కటోడ మెస్రం కోసేరావ్, కటోడ హనుమంత్రావ్, పర్ధాంజీ మెస్రం దాదారావ్, నాగోబా పేన్ కోత్వాల్ మెస్రం తిరుపతి, నాయిక్వాడీ ధర్ము, మెస్రం వంశీయులు పాల్గొన్నారు. కాగా, నాగోబా జాతరను పురస్కరించుకొని ఆలయ ప్రాంతంతోపాటు దర్బార్హాల్, గోవాడ్, తైబజార్, మెయిన్రోడ్డుకు ఇరువైపులా నిఘా కోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నాగోబా దర్బార్హాల్లో పోలీస్ అధికారులతోపాటు సిబ్బందితో ఆదిలాబాద్ ఓఎస్డీ రాములునాయక్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నాగోబా దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. జాతరలో విధులు నిర్వహించేందుకు 450 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఆయన వెంట డీటీసీ డీఎస్పీ ఉమామహేశ్వర్, డీసీఆర్బీ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సైదారావ్, ఎస్ఐ డీ సునీల్ తదితరులు పాల్గొన్నారు.
నాగోబా జాతర ఏర్పాట్లను డీపీవో శ్రీనివాస్, ఐటీడీఏ ఈఈ భీంరావ్ పరిశీలించారు. గోవాడ్తోపాటు మర్రిచెట్ల ప్రాంతంలో డీపీవో స్థానిక సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్తో కలిసి పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతిరోజూ పారిశుధ్య పనులు చేయాలన్నారు. దర్బార్హాల్తోపాటు నాగోబా ఆలయం లోప ల, ప్రభుత్వ స్టాళ్ల ఏర్పాటు స్థలాల్లో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ప్రత్యేక బారిగేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాగోబా జాతరలో ఏర్పాటు చేసే వివిధ రకాల దుకాణాలతోపాటు నాగోబా ఆలయం, దర్బార్హాల్, క్రీడామైదానం, పార్కింగ్ స్థలం, గోవాడ్, నీటి ట్యాంకు లు, తైబజార్ ఏర్పాటు, రంగుల రాట్నాల ఏర్పాటుతో కూడిన ప్రత్యేక మ్యాప్ను ఎస్ఐ డీ సునీల్ తయారు చేశారు. మ్యాప్ను చూడగానే నాగోబా జాతరలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నా యో సులువుగా అధికారులకు అర్థమవుతుంది.