ఎదులాపురం, ఏప్రిల్ 20 : బోథ్ నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 25న బీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించి, విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లోని తన నివాసంలో గురువారం గురువారం బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జెండా పండుగ సందర్భంగా ఉదయం అన్ని గ్రామాల్లో పార్టీ జెండా ఎగురవేసి, నియోజకవర్గం కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ సమావేశంలో నియోజవర్గంలోని అన్ని మండలాల బీఆర్ఎస్ కన్వీనర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ, పీఏసీఎస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఇతర నాయకులు హాజరయ్యారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత..
భీంపూర్, ఏప్రిల్ 20 : భీంపూర్ మండలం బండలనాగపూర్కు చెంది సౌజన్య కుటుంబానికి రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ మంజూరవగా, తన నివాసంలో ఎమ్మెల్యే బాపురావ్ అందజేశారు. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వర్గాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో గ్రామాల్లో ఆరోగ్యకేంద్రాలు, రిమ్స్లో కూడా ఆధునిక సౌకర్యాలతో సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. బోథ్ నియోజకవర్గం ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ లబ్ధిలో ముందున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సురకుంటి మంజుల, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు సురుకుంటి శ్రీధర్రెడ్డి తదితరులున్నారు.