కడెం, ఏప్రిల్ 30 : కార్యకర్తలే మా బలం.. బలగం అని, వారు లేకుంటే నాయకులు లేరని.. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని, రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్, మర్సుకోల సరస్వతిలు పేర్కొన్నారు. మండలంలోని కొండుకూర్ గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఖానాపూర్, పెంబి, కడెం, దస్తురాబాద్, జన్నారం మండలాల ప్రజాప్రతినిధు లు, నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. ఆత్రం సక్కును గెలిపించుకుందామని పేర్కొన్నారు. సమావేశంలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి..;బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి సక్కు
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి సక్కు పేర్కొన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హామీల పేరిట ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, గతంలో ఎంపీగా అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ప్రజల కోసం చేసింది ఏమి లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతులు, ఉద్యోగులు, వ్యవసాయ కూలీలను ఆగం చేసిందని అన్నారు. రుణమాఫీ, పింఛన్, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతులకు రైతుబంధు, క్వింటాలు ధాన్యానికి రూ.500 బోనస్, కల్యాణ లక్ష్మికి తులం బంగారం వంటి పథకాల హామీలు ఎక్కడని ప్రజలు నిలదీయాలని సూచించారు. ప్రజలను మోసం చెసిన కాంగ్రెస్ పార్టీని గద్దెదించాలని ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్నాయక్ అన్నారు. ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మర్సుకోల సరస్వతి, నాయకులు గౌరికర్ రాజు, రాజగంగన్న, రామునాయక్, నారాయణ, శ్రీనివాస్, మల్లేశ్, ప్రదీప్, రాజన్న పాల్గొన్నారు.