బెజ్జూర్, ఫిబ్రవరి 21: మండలంలోని బెజ్జూర్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతం తెల్లరాపు గుట్ట, సోమిని సమీపంలో ప్రాణహిత నది ఒడ్డున బుధవారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలతో పాటు ఆటోల్లో భక్తులు తరలి వెళ్లారు. జాతరలో వెలిసిన దుకాణాల వద్ద సామగ్రి కొనుగోలు చేశారు. మొక్కులు తీర్చుకొని, సహపంక్తి భోజనాలు చేశారు. జాతరకు వచ్చిన భక్తులకు కమిటీ తరపున తాగునీరు, ఇతర వసతులు కల్పించారు. జాతరలో భక్తులకు అట వీ అధికారులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వంటల అనంతరం మం టలు ఆర్పివేయాలని సూచించారు. వన్య ప్రా ణులకు ఎలాంటి ఇబ్బంది తలపెట్టవద్దని కోరారు. జాతరకు వచ్చిన భక్తులు పరిసరాల్లోనే ఉండాలని, అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని సూచించారు. కార్యక్రమంలో బీట్ అధికారులు శ్రీధర్, సంఘదీప్, సిబ్బంది ఎల్లం జోగు, అనిమల్ ట్రాకర్స్ సిబ్బంది మహేశ్, బక్కయ్య, అశోక్, రాకేశ్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
తిర్యాణి, ఫిబ్రవరి 21 : కన్నేపల్లి పంచాయతీ పరిధిలో కొలువైన శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభమయ్యాయి. సమీప అటవీ ప్రాంతం నుంచి సారలమ్మను కోయ పూజారులు గద్దెపై ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో జాతర నిర్వహణ కమిటీ గౌరవాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, అధ్యక్షుడు వెడ్మ భగవంతరావు, ఉపాధ్యక్షుడు మార్నేని తిరుపతి, ప్రధాన కార్యదర్శి గుందం రారాజు, పూజారులు బొమ్మగోని సత్తయ్యగౌడ్, కరగంటి బాపు, భక్తులు పాల్గొన్నారు.
రెబ్బెన, ఫిబ్రవరి 21 : గంగాపూర్ శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయం పక్కన, లక్ష్మీపూర్ గ్రామ శివారులో వెలసిన సమ్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజును డప్పు వాయిద్యాల నడుమ ఆదివాసీ ఆచారాలతో పూజలు నిర్వహిస్తూ కంకవనం రూపంలో అమ్మవారిని పూజారులు గొల్లపెల్లి సత్తమ్మ, దేవర వినోద్ గద్దెపైకి తీసుకువచ్చారు. భక్తులు పూజలు చేసి వన దేవతలకు ఓడి బియ్యం, మేకలు, కోళ్లు కోసి, నిలువెత్తు బంగారం(బెల్లం) తల నీలాలు సమర్పించుకున్నారు. గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెపైకి వస్తుందని పూజారులు తెలిపారు.
Adilabad2
మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే..
పల్లవి ఫ్యాక్టరీ వెనుక కొలువైన సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బెల్లంపల్లి ఏరియా జీఎం రవిప్రసాద్ మొక్కులు చెల్లించుకున్నారు. వారి వెంట ప్రజాప్రతినిథులు, అధికారులు ఉన్నారు.
కాగజ్నగర్ టౌన్, ఫిబ్రవరి 21 : మండలంలోని పెద్దవాగు సమీపంలో సమ్మక్క-సారలమ్మ జాతర బుధవారం ప్రారంభమైంది. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు సా యంత్రం గద్దెలపైకి రావడంతో భక్తులు మొ క్కులు చెల్లించుకున్నారు. జాతర నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.