దస్తురాబాద్, జూన్ 9 : వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ రోజురోజుకూ పెరుగుతున్నది. గతంలో రైతులు వరి పంటను కూలీలతో కోయించేవారు. అనంతరం వాటిని పశువులు, ట్రాక్టర్ల స హాయంతో తొక్కించి గడ్డిని వేరు చేసేవారు. దీం తో పశువులకు సరిపడా గడ్డి లభించేది. ప్రస్తుతం వరి పంటను హార్వేస్టర్ల సహాయంతో కోయిస్తున్నారు. దీంతో గడ్డి సేకరణ కోసం రైతులకు అధిక ఖర్చు చేయాల్సి వస్తున్నది. సాధారణంగా కూలీలతో కోసిన వరి గడ్డి పొడవుగా ఉండి సేకరణ సులువుగా ఉంటుంది. కానీ హార్వెస్టర్తో కోసిన గడ్డి చిన్నగా ఉండి సేకరించడం, తరలించడం కష్టంగా ఉంటుంది. ఈ క్రమంలో రైతులు బేలర్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వాటితో గడ్డిని చుట్టి కట్టలు కడుతున్నారు. దీంతో పశుగ్రాసం వృథా కాకుండా ఉంటున్నది.
ఎకరానికి 40-50 కట్టలు..
హార్వేస్టర్తో వరి కోసిన తర్వాత బేలర్ను ట్రాక్టర్కు బిగించి కట్టలు కడతారు. వరి గడ్డిని గుం డ్రంగా చుట్టి కట్టలు కడుతుంది. ఇలా ఒక ఎకరం పొలంలో గడ్డి కట్టలుగా కట్టడానికి గంట సమ యం పడుతుంది. దాదాపు 40-50 కట్టలు వస్తా యి. ఒక్క కట్ట కట్టడానికి సుమారు రూ.35-40 తీసుకుంటున్నారు. పాడి రైతులు పశువుల మేత కోసం తప్పనిసరిగా బేలర్ యంత్రంతో గడ్డిని కట్టలుగా కట్టించి ఇంటికి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల సహాయంతో తరలిస్తున్నారు. ఇంటి వద్ద ఆ కట్టలను పేర్చి నిల్వ చేసుకుంటున్నారు. మళ్లీ వానకాలం పంట వచ్చే వరకు సరిపడే పశుగ్రాసాన్ని రైతులు సమకూర్చుకుంటున్నారు.
గడ్డి కట్టలతో లాభాలు..
సమయం ఆదా..
వరి పంటను కోసిన తర్వాత గడ్డి సేకరణ కో సం కూలీలకు అధిక ఖర్చులు అవుతాయి. సమయం వృ థా అవు తుం ది. బేలర్ యంత్రం సహాయంతో కట్టలు కట్టించడం ద్వారా సమ యం ఆదా అ వుతుంది. గడ్డి వృథా కాదు. కూ లీల ఖ ర్చులు తగ్గ్గాయి. తక్కువ మంది కూలీ లతో గడ్డి కట్టలను ఇంటికి తీసుకరావచ్చు. ఎకరానికి 40-50 గడ్డి కట్టలు వస్తాయి.
– పిట్ల నవీన్,రైతు
ఖర్చులు తగ్గాయి..
గతంలో వరి గడ్డి ఒక్క చోటకి తేవ డానికి, వాము చే యడానికి రోజు కు ఒక్కొక్క కూలి కి రూ.500 అ య్యేవి. బేలర్ యంత్రంతో నేడు కట్టలు కడితే కూలీల ఖర్చు లు తగ్గాయి. దీనికి తోడు సమయం వృథా కావడం లేదు. రై తులకు గడ్డి సేకరణ సులువు అవుతుంది. కట్ట లు కట్టడంతో గతం లో కంటే ఎక్కువ కాలం పాడవకుండా ఉం టుంది.
– సంగ సంతోష్, రైతు