నిర్మల్ శివారులోని మంజులాపూర్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది.పగుళ్లు తేలిన గోడలు, ఎప్పుడు కూలుతుందో తెలియని పైకప్పు, వానకాలంలో లీకయ్యే వర్షపు నీరు, ప్రహరీ లేకపోవడంతో కుక్కలు, పందుల స్వైర విహారం.. ఇలా అనేక సమస్యల మధ్య విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు. కొందరు మౌలిక సదుపాయాలు లేక చదువుకు దూరమయ్యారు.
తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా రూ.23 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఎల్ఈడీ లైట్స్, ఫ్యాన్లు, గ్రీన్ బోర్డు, ఫ్లోరింగ్ వేసి బడిని అందంగా తీర్చిది ద్దింది. ఫలితంగా కార్పొరేట్కు దీటుగా కొత్తరూపును సంతరించుకున్నది. విద్యుద్దీకరణతోపాటు, ప్రహరీ నిర్మాణం, శుద్ధజలం, టాయిలెట్లు అందుబాటులోకి రావడంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకునే వెసులుబాటు కలిగింది.
– నిర్మల్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ)