“రైతన్నలకు అండగా ఉండడానికి రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చాం. ఈ పథకం కింద లక్షకు పైబడిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందించాం. బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు రూ.5 వేల కోట్ల వరకు ఇచ్చాం. నేత, గీత కార్మికులకుకూడా బీమా తెచ్చినం. రాష్ట్రంలోని 93 లక్షల పైచిలుకు కుటుంబాలకు రేషన్కార్డులు ఇచ్చాం. తెల్ల రేషన్ కార్డులున్నవారికి వచ్చే ఏడాది మార్చి తర్వాత వందకు వంద శాతం ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతుబీమా తరహాలో ‘కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ ధీమా’ పేరిట జీవిత బీమా కల్పిస్తాం. ప్రతి కుటుంబానికి బీమా కోసం అవసరమయ్యే రూ.3-4 వేలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనిని గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత జూన్ నుంచి అన్ని అర్హత గల కుటుంబాలకు వర్తింపజేస్తాం. అన్ని కుటుంబాలకు ఒక రక్షణ కవచంగా ఇది ఉంటది.” అని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటన అనంతరం జరిగిన బహిరంగ సభలో పేర్కొన్నారు. ఈ పథకం ప్రతి కుటుంబానికి అండగా ఉంటుంది. ఇది చరిత్రలో నిలిచిపోయే పథకమని ప్రజలు చెబుతున్నారు. ఈ పథకం కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 7.50 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.
– మంచిర్యాల, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సీఎం కేసీఆర్ సార్.. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ‘కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా’ అనే పథకం పేదలకు మేలు చేసేలా ఉంది. రైతుబీమా తరహాలో ఏ కారణం చేతనైనా మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు బీమా ద్వారా అందిస్తారట. దీనికి సంబంధించిన ప్రీమియం డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు మేలు జరుగనుంది. అనారోగ్యం, ప్రమాదవశాత్తు ఇతర కారణాలతో మరణిస్తే రూ. 5 లక్షల బీమా సాయం అందనుంది.
– కాకర్ల ప్రశాంత్, కజ్జర్ల, తలమడుగు మండలం
మంచిర్యాల, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ పాలన యావత్ దేశానికే ఆదర్శం. గడిచిన పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు గరిబోడి కన్నీళ్లు తుడిచాయి. దేశంలో ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని ఆలోచనలు సీఎం కేసీఆర్ చేశారు. రైతుబంధుతోపాటు ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రూ.5 లక్షలు ఇచ్చే రైతుబీమా పథకాన్ని అమలు చేసి చూపించారు. అప్పులకుప్పలై ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న రైతు చనిపోతే రోడ్డున పడే పరిస్థితుల్లో ఉన్న ఎన్నో రైతుల కుటుంబాలకు రైతుబంధు.. ఆత్మ బంధువై నిలుస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వందల మంది రైతులు ఈ పథకం కింద లబ్ధిపొందారు. వ్యవసాయమే ఆధారంగా చేసుకొని బతుకుతున్న రైతులకు అండగా ఉన్నట్లే, రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతికే పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయే మరో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తెల్ల రేషన్కార్డు ఉన్న కుటుంబాలన్నింటికీ రైతుబీమా తరహాలోనే ‘కేసీఆర్ బీమా’ ఇస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారంలోకి రాగానే కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అదే జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 7.50 లక్షల కుటుంబాలకు మేలు జరగనుంది. ఈ నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
తాండూర్, అక్టోబర్ 21 : మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చేసినా పేదోళ్లకు ఉపయోగప డేలా ఉంటది. ఇప్పుడు తీసుకొస్తున్న కేసీఆర్ బీమా పథకం కూడా ఆయా కుటుంబాలకు ధీమాగా ఉంటది. బీమా చేసుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకు న్నది. అలాంటి బీమాను బీఆర్ఎస్ పార్టీ ఉచితంగా చేస్తామని ప్రకటించడం గొప్ప విషయం. రైతుబీమా తరహాలోనే ఈ పథకం అమలు చేస్తామని చెప్పారు. ఇది వరకున్న ప్రభుత్వాలు పేదలను పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ మానవతా దృక్ఫథంతో ఈ పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందుకే మరోసారి బీఆర్ఎస్ వెంటే ఉంటం.
– నస్పూరి జ్యోతి మాదారం, తాండూర్
లక్షెట్టిపేట, అక్టోబర్ 21 : మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం తీసుకొచ్చినా అది పేదలకు మేలు చేసేలా ఉంటది. ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పేదల కోసం కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తామని చెప్పిన్రు. దురదృష్టవశాత్తు ఎవ్వరైనా చనిపోతే బీమా ద్వారా రూ. 5 లక్షలు అందిస్తరట. దీంతో కుటుంబాలకు భరోసాగా ఉంటది. ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నంత కాలం ప్రజలకు మేలు జరుగుతది.
– బానాల శోభ, వడ్లవాడ, లక్షెట్టిపేట
వాంకిడి, అక్టోబర్ 21 : బీఆర్ఎస్ సర్కారు పేదల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నది. ఇప్పటికే రైతుబీమా పథకం తీసుకొచ్చి రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్నది. అదే తరహాలో నిరుపేదల కోసం కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తామని ఇటీవల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఈ బీమా పథకం అమల్లోకి వస్తే కుటుంబాలకు భరోసాగా ఉంటుంది. బీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే మరోసారి గెలిపిస్తాయి. ఆ పార్టీ అధికారంలోకి వస్తేనే అందరికీ మేలు జరుగుతది.
– కమాన్కార్ రవీందర్, ఖమాన, వాంకిడి
కడెం, అక్టోబర్ 21 : తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న పేద కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించడం మాలాంటి కుటుంబాలకు ఎంతో ధీమా. రైతుబీమా లెక్క మహిళల పేరిట రూ.5 లక్షల వరకు బీఆర్ఎస్సే ప్రీమియం కట్టి పేద కుటుంబాలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం వల్ల అనేక కుటుంబాలకు అండగా నిలిచిన వారవుతారు. దీనికి కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా అని పేరు పెట్టడం నిజంగా మాలాంటి ఎన్నో కుటుంబాలకు ధీమా. కులాలతో సంబంధం లేకుండా తెల్లరేషన్కార్డు ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఎల్ఐసీ ద్వారా మహిళల పేరిట బీమా సౌకర్యం కల్పించడం గ్రేట్.
– మాటేటి లస్మవ్వ, నచ్చన్ఎల్లాపూర్, కడెం
భైంసా, అక్టోబర్ 21 : బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో కేసీఆర్ ధీమా పథకం ఉండడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి, నిరుపేదల జీవితాలకు ఎల్లవేళలా భరోసా ఇస్తు న్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడానికి కేసీఆర్ ధీమా పథకం మేలు చేస్తుందని భావిస్తున్నా. ఎల్ఐసీ ద్వారా పేదలకు పూర్తి బీమా ప్రీమియం చెల్లించడం, రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించడమనేది ఇప్పటి వరకు ఏ సర్కారు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం తోనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకా లను అమలు చేస్తున్న ఏకైక బీఆర్ఎస్ ప్రభుత్వం చరిత్రాత్మకమైన పథకం తీసుకువచ్చింది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల కేసీఆర్ బీమా చేస్తారట.
– మంత్రి భోజారాం, భైంసా.
మామడ, అక్టోబర్ 21 : సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో చాలా బాగుంది. కేసీఆర్ సారు మాటిచ్చిండంటే కట్టుబడి ఉంటారు. ఆయన ఆలోచన అంతా పేదల బాగు గురించే ఉంటది. కొత్తగా తీసు కొస్తున్న కేసీఆర్ బీమా పథకం ప్రతి పేద కుటుంబా నికి ధీమాగా ఉంటది. చేతి కష్టం చేసుకునే కూలీలు, నెల జీతాల కోసం ఎదురు చూసే పేద, మధ్య తరగ తి ప్రజలకు ఆర్థికంగా తోడ్పాటునిస్తుంది. ప్రభుత్వ మే ఉచితంగా ప్రీమియం చెల్లించి రూ.5 లక్షల బీమా కల్పించడం పేద కుటుంబాలకు భరోసా ఇచ్చినట్టే.
– ఏటి రాజేశ్వర్, కొరిటికల్, మామడ మండలం.