నార్నూర్, మే19 : దశల వారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో మంద మకరంద అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఖైరదట్వా గ్రామంలో జన్ భాగీదారి అభియాన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరంద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోడ్డులు, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ఆదివాసీ నాయకులు పీవోను కోరారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పిల్లలు ఉన్నత చదువులు అభ్యసిస్తేనే ప్రయోజకులుగా ఎదుగుతారన్నారు.
పంచాయతీ అభివృద్ధికి సంబంధించిన అంశాలు సమన్వయంతో చర్చించి తీర్మానం చేయాలని, తీర్మానం ప్రణాళికాబద్ధంగా ఉండాలని, ప్రభుత్వ పథకాలను వందశాతం అమలు చేసిన అధికారులకు బహుమతి ప్రకటిస్తామని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న సమస్యలు దశలవారీగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనక సత్యనారాయణ,ఉప సర్పంచ్ విశ్వజిత్, అడిషనల్ డీఎంహెచ్ఓ కుడ్మెత మనోహర్, డీఎల్ పీవో ప్రభాకర్, తాహసిల్దార్ జాడి రాజలింగం, ఎంపీ డీవో పూల్లారావ్,ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.