మంచిర్యాల ఏసీసీ/గర్మిళ్ల, జనవరి 27 : నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేశ్కుమార్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు.
ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి ప్రయాణికులను సురక్షితంగా గ మ్యస్థానాలకు చేర్చాలన్నారు. లైసెన్స్ తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడుపొద్దని, వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రోడ్డు ప్ర మాదాలు జరిగినప్పుడు సామజిక బాధ్యతగా క్షతగాత్రులను దగ్గరలోని దవాఖానకు తరలించాలని కోరారు. త్వరలో లైసెన్స్ మేళా, ఆటో డ్రైవర్ల కోసం వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.