లక్షెట్టిపేట, ఏప్రిల్ 28: పట్టణంలోని ఇన్ డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ను మంచిర్యాల డీసీఎస్వో ప్రేమ్కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఫిల్లింగ్ స్టేషన్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించారు. మరికొన్ని పత్రాలను కార్యాలయానికి తీసుకురావాలని నిర్వాహకులను ఆదేశించారు.
సంబంధిత అధికారులను పిలిపించి శాంపిల్ సేకరించి ఎఫ్ఎస్ఎల్కు పంపిస్తామని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ జ్యోత్స్న టాస్క్ఫోర్స్ సిబ్బంది ఉన్నారు.