కాగజ్నగర్ రూరల్, జనవరి 7: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని భట్టుపల్లి జడ్పీఎస్ఎస్ పాఠశాలలో శ్రీ సత్యాసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ‘మనఊరు- మనబడి’ కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల ను కల్పిస్తున్నాదన్నారు. విద్యార్థులు ఉద యం పాఠశాలకు వచ్చిన వెంటనే అల్పాహా రం, ఉప్మ, రాగిజావ అందించడం సంతోషం గా ఉందన్నారు. అనంతరం సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాగి జావ అందించడం అభినందనీయం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సత్యాసాయి అన్నపూర్ణ ట్రస్ట్ కర్ణాటక వారు సద్గురు శ్రీ మధుసూదన సాయి వారి సౌజన్యంతో ఉచితంగా రాగి జావ పం పిణీ చేయడం అభినందనీయమని కలెక్టర్ రా హుల్ రాజ్ అనారు. మండలంలోని బూరుగూడ జడ్పీ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన రాగి జావా పంపిణీ కార్యక్రమానికి డీఈవో అశోక్, ట్రస్ట్-కర్ణాటక కార్యదర్శి ఆనంద్ కడారి, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రా వు, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్తో కలిసి కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాగి జావా విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ట్రస్టు కార్యదర్శి మాట్లాడుతూ జిల్లాలో గల 720 పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 42 వేల మంది విద్యార్థులకు రాగి జావాను ప్రతిరోజూ అందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈవో మన్కుమార్, ప్రధానోపాధ్యాయులు మరియాల ఉదయ్బాబు, సర్పంచ్ మాధవి, ఎంపీటీసీ రమేశ్, ఉప స ర్పంచ్ కుమార్, సత్యసాయి కార్యవర్గం, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.