మంచిర్యాల : మామ చేతిలో దారుణ హత్యకు గురైన బోరగాండ్ల సౌందర్య కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామస్తురాలు బోరగాండ్ల సౌందర్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
వారికి కుటుంబానికి తక్షణ సహాయం కింద లక్ష రూపాయలు అందజేశారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని విప్ హామీ ఇచ్చారు. సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, రామగుండం పోలీస్ కమిషర్కు సూచించారు.