కోటపల్లి, జూలై 28 : మంచిర్యాల జిల్లా కోటపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఖాళీగా బైపీసీ సీట్లు కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని కళాశాల స్పెషల్ ఆఫీసర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు.
KGBV కళాశాలలో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు ఈ నెల 29, 30 తేదీలలో కళాశాలలో నేరుగా సంప్రదించి అడ్మిషన్ పొందవచ్చని వివరించారు. ఇంటర్ ప్రవేశం పొందే విద్యార్థులు వారి విద్యార్హత ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్, ఇతర ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని స్పెషల్ ఆఫీసర్ సూచించారు.