సీసీసీ నస్పూర్ : రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించడమే సింగరేణి లక్ష్యమని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ సురేశ్ పేర్కొన్నారు. శనివారం సీసీసీ సింగరేణి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో శ్రీరాంపూర్ ఏరియా వర్క్షాప్, ఏరియా స్టోర్స్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు సేఫ్టీపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు జీఎం సురేశ్, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జనరల్ మేనేజర్ బళ్లారి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. భూగర్భ, ఉపరితల గనులు, డిపార్ట్మెంట్లలో పనిచేసే ఉద్యోగులు తప్పని సరిగా రక్షణ సూత్రాలు పాటించాలన్నారు.
ప్రమాద రహిత సింగరేణిగా మార్చడానికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలని కోరారు. ప్రమాదాలు జరుగకుండా యాజమాన్యం పకడ్బంది చర్యలు తీసుకుంటుందని, ఇందు కోసం ఉద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహించి సేఫ్టీపై అవగాహన కల్పిస్తుందన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో ఏరియా ఇంజినీర్ కుమార్, ఈఅండ్ఎం ఏజీఎం రామనాథం, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గోశిక మల్లేశ్, సీహెచ్సీ డీజీఎం డీవీ రావు, ఏరియా స్టోర్స్ డీజీఎం సోమశేఖర్, వర్క్షాప్ ఎస్ఈ సతీశ్చక్రవర్తి, సింటార్స్ తదితరులు పాల్గొన్నారు.