హైదరాబాద్ : ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడటంతో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కొత్తగూడెం నుంచి బెల్లంపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు మందమర్రికి చేరుకోగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈఘటనలో బస్సు డ్రైవర్తో పాటు ఓ ప్రయాణికుడికి గాయాలయ్యాయి. సమాచారం అందకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
ఇవి కూడా చదవండి..
LPG Price Hike | సామాన్యుడిపై మరో భారం.. రూ.29 పెరిగిన డొమెస్టిక్ సిలిండర్ ధర!