దండేపల్లి : ప్రతి విద్యార్థి సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని వెరబెల్లి ఫౌండేషన్ అధ్యక్షుడు రఘునాథరావు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెలుగనూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆయన మంగళవారం ఐదు ల్యాప్టాప్లు,(Loptops) టీవీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థులు కష్టపడి చదువుకొని ముందుకు రావాలని సూచించారు.
నేటి సాంకేతిక యుగంలోలో ప్రతి విద్యార్థి సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటేనే భవిష్యత్తులో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అనంతరం సర్పంచ్గా ఎన్నికైన మానస తులసి, రఘునాథరావుని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, భాజపా నాయకులు బందెల రవి గౌడ్, గోపతి రాజయ్య, సురేష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.