చెన్నూర్, ఆగష్టు 7: చెన్నూర్లో ఆదివారం మో స్తరు వర్షం కురిసింది. నాలుగైదు రోజుల నుంచి చిన్నపాటి జల్లులు పడుతున్నాయి. కాలువలు నిండుగా ప్రవహించడంతో పాటు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షంతో పాటు మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం చల్ల బడింది. వ్యవసా య పనులకు ఆటంకం కలిగింది.
చెన్నూర్ రూరల్, అగస్టు 7 : చెన్నూర్ మండలం లో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వ ర్షం కురిసింది. దీంతో మండలంలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. సుద్దాల, నారాయణపూర్, కత్తెరశాల, రాయిపేట, సంకారం గ్రామాలవాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆయా గ్రా మాల పంట చేనులు, పొలాల్లోకి వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అల్పపీడనం కారణంగా మరో రెండు, మూడు రోజులు వర్షాలు ఉ న్నాయని, గ్రామస్తులంతా అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ ప్రవీణ్ కుమార్ గ్రామస్తులకు సూచించారు. గ్రామాల్లో ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం అం దించాలని సీఐ తెలిపారు. పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఉండకూదని గ్రామస్తులకు సూ చించారు. ఆయన వెంట ఎస్ఐ మహేందర్, చం ద్ర శేఖర్, ఆర్ఐ తిరుపతి ఉన్నారు.
కన్నెపల్లి, ఆగస్టు 7: కన్నెపల్లి , భీమిని మండలాల్లో శనివారం రాత్రి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం రైతులు వ్యవసాయ పనులకు వెళ్లలేకపోయారు. మరో వై పు పత్తి పంట అధిక వర్షాలకు ఎదగక నష్టం కలుగుతున్నదని రైతులు ఆందోళన చెందుతున్నా రు. వర్షానికి గ్రామాల్లోని మట్టి రోడ్లన్నీ బురదమయమై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
లక్షెట్టిపేట, ఆగస్టు 7: మండలంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మండలంలో 39.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ సనత్ కుమార్ తెలిపారు. మరో రెండు రోజుల పా టు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
గుంతలో దిగబడిన పాఠశాల బస్సు..
మంచిర్యాల పట్టణం కేంద్రంలో భారీగా కురుస్తున్న వర్షాలకు ఆదివారం ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు గుంతలో దిగబడింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందిచడంతో ట్రాఫిక్ సీఐ నరేశ్కుమార్ సిబ్బందితో క లిసి అక్కడికి చేరుకొని స్థానికుల సహాయంతో బస్సును బయటకు తీశారు. ఎస్ఐ విజయ్, తదితరులున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మండలంలోని గొ ల్లగూడ గ్రామానికి చెందిన తుమోజు ప్రసాద్ ఇ ల్లు ఆదివారం కూలింది. పంట చేలల్లోకి వరద చే రడంతో రైతులకు నష్టం మిగిలింది.
కుమ్రం భీం ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత..
మండలంలోని కుమ్రంభీం ప్రాజెక్టులోకి వరద చే రడంతో ఆదివారం అధికారులు రెండు గేట్లు ఎత్తి 1400 క్యూసెక్కుల వరదను దిగువకు వదిలారు. వట్టివాగు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 899 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. లోతట్టు ప్రాం తాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.