బెజ్జూర్, ఆగస్టు 7 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ మంజూరు చేయడంపై టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం బెజ్జూర్ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల కావాలని పట్టుదలతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేశారని తెలిపారు. దీంతో జిల్లా విద్యార్థులకు న్యాయం జరిగిందని సంతోషించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సిడాం సకారాం, ఎంపీటీసీ పర్వీన్ సుల్తానా, టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు కోండ్ర నరేందర్ గౌడ్, నాయకులు జావీద్అలీఖాన్, చిప్పకుర్తి దేవాజీ, జాహిద్ హుస్సేన్, శౌకత్ అలీఖాన్, సూర్ల శంకర్, అడ్డూరి రాజేశ్, ఇర్ఫాన్, శంకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లిలో..
జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేయడంపై టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్ వద్ద మండల కోఆప్షన్ సయ్యద్ సాజిద్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల జిల్లా వైద్య రంగంలో అభివృద్ధి చెందేందుకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప విన్నపం మేరకు మెడికల్ కళాశాల మంజూరు చేయడం సంతోషకరమన్నారు. దీంతో వైద్య రంగంలో జిల్లా విద్యార్థులు అభివృద్ధి చెందుతారని తెలిపారు. డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల జాగృతి అధ్యక్షుడు సర్పంచ్ ఉపాసి సంజీవ్, నగునూరి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు పూదరి వెంకటి, సిరిపురం రాజేశ్, సుగుణాకర్, ఇస్తారి, మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.