మంచిర్యాలటౌన్, ఆగస్టు 7: ప్రతి ఒక్కరూ చేనేత వస్ర్తాలను ధరించి, చేనేత పరిశ్రమ, కార్మికులకు అండగా ఉండాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ భారతీ హోళికేరి ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత పరిశ్రమ ప్రధాన భూమికను పోషించిందని, మహాత్మా గాంధీ కూడా రాట్నంపై నూలు వడికేవారని గుర్తు చేశారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని తెలిపారు. అనంతరం పలువురు చేనేత కార్మికులను సన్మానించారు. చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, పురుషోత్తం నాయక్, పలువురు అధికారులు, చేనేత సహకార సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చేనేత వస్ర్తాలను ధరించి, కార్మికులను ఆదుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం జాతీయ చేనేత దినోత్సవంలో కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ రాజేశం, చాహత్బాజ్పాయితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్వోతి ప్రజ్వలన చేసిన కోవ లక్ష్మి మాట్లాడారు. ప్రభుత్వం చేనేత పరిశ్రమలకు చేనేత మిత్ర పథకంలో 40 శాతం సబ్సిడీపై నూలు అందజేస్తున్నట్లు తెలిపారు. జీవన జ్యోతి బీమా యోజన పథకం అమలు చేస్తున్నామన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్కు వచ్చే అధికారులు తప్పని సరిగా చేనేత దుస్తూలు ధరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. అనంతరం చేనేత కార్మికులను శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, వివిధ శాఖల అధికారులు రబ్బాని, రమేశ్, ప్రభాకర్రెడ్డి, సజీవన్, చేనేత కార్మికులు, పద్మశాలీ సంఘం నాయకులు కనకయ్య, చెన్నూరి అశోక్, సరస్వతి, మహేశ్వరి, రామకృష్ణ, ధర్మయ్య, లింగయ్య, శ్రీకాంత్, శ్రీనివాస్, చందు, తదితరులున్నారు.
విద్యార్థులకు బహుమతుల అందజేత
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలాల వారీగా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీలో ప్రతిభ చూపిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. జిల్లా స్థాయిలో అమూ ల్య, అరుణ ప్రథమ స్థానం, అనిత, ప్రణతి ద్వితీయ స్థాన ంలో నిలిచారు. రెండు విభాగాల్లో విద్యార్థులను ఎంపిక చేసినట్లు పోటీల నిర్వహణ అధికారి ఉదయబాబు తెలిపారు.