మంచిర్యాల ప్రతినిధి, (నమస్తే తెలం గాణ)/మందమర్రి రూరల్, డిసెంబర్ 17 : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెం కటాపూర్ పంచాయతీ పరిధి గుడిపెల్లిలోని ఎమ్మె ల్యే కాలనీలోగల మాసు శివయ్య (52) ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఇల్లు పైకప్పునున్న గూన పెంకులు వేడికి పగులుతున్న శబ్ధం కావ డంతో చుట్టుపక్కల వారు బయటికి వచ్చి చూశా రు. వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఫైర్ ఇంజిన్కు కూడా స మాచారం ఇచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనలో మాసు శివ య్యతో పాటు ఆయన భార్య పద్మ (45), శనిగార పు శాంతయ్య (54), గడ్డం మౌనిక (25)తో పాటు ఆమె కుమార్తెలు ప్రశాంతి (4) హిమ బింధు (18 నెలలు) మంటల్లో చిక్కుకొని గుర్తు పట్టలేనంతగా కాలిపోయారు.
పథకం ప్రకారమే ఇంటికి నిప్పు..!
మాసు శివయ్య, మాసు పద్మ భార్యాభర్తలు. పద్మకు గోదావరిఖనికి చెందిన సింగరేణి ఉద్యోగైన శనిగారపు శాంతయ్యకు పదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం మాసు శివయ్య కు తెలుసునని, ఆయన కూడా వారి సహజీవనా నికి అంగీకరించారని, అందుకే నాలుగేళ్లుగా ముగ్గురు కలిసే ఉంటున్నారని స్థానికులు చెబుతు న్నారు. కాగా, శాంతయ్య ఉద్యోగ విరమణ దగ్గర పడింది. ఈ నేపథ్యంలో ఆయన మొదటి భార్య, కుమారులు తండ్రి ఉద్యోగంతో పాటు ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే డబ్బులు తమకే కావాలని అడుగుతున్నారు. ఇందుకు మాసు పద్మ ఒప్పు కోవడం లేదు. దీంతో శాంతయ్య మొదటి భార్య కుటుంబానికి, పద్మ కుటుంబానికి ఆస్తి పంప కా ల విషయంలో కొన్నేళ్లుగా గొడవలు జరుగుతు న్నాయి. ఆ కక్షతోనే శాంతయ్య, పద్మను అంతం చేయాలని ఆయన కుమారులే వీరుంటున్న ఇంటి కి నిప్పు పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నా రు.
ఇంటి వెనుకాల నిలిపిన ఆటోలో రెండు పెట్రోల్ టిన్నులు, పెట్రోల్ పోసేందుకు వీలుగా తయారు చేసిన బాటిళ్లు, కారంపొడి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో ఇది అగ్ని ప్రమాదం కాదని.. పథకం ప్రకారమే నిప్పు పెట్టారనే ని ర్ధారణకు పోలీసులు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు శాంతయ్య భార్య, ఇద్దరు కొడుకులతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీ సులు విచారిస్తున్నారు. 15 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంచిర్యాల డీసీపీ అఖిల్ మహా జన్, బెల్లంపల్లి ఇన్చార్జి ఏసీపీ తిరుపతి, జైపూర్ ఏసీపీ నరేందర్ తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికుల వద్ద వివరాలు సేకరించారు.
చంటి బిడ్డలతో చుట్టపు చూపుగా వచ్చి..
కోటపల్లి, డిసెంబర్ 17 : కోటపల్లి మండలం కొండంపేట గ్రామానికి చెందిన మౌనిక తల్లి దండ్రులు పదేళ్ల క్రితం మృతి చెందారు. ఏడేళ్ల క్రితం జగన్ను వివాహం చేసుకున్నది. వీరికి ఇద్ద రు కూతుళ్లు ప్రశాంతి, హిమబింధు. ఏడాది క్రితం జగన్ సైతం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి పిల్లలతో కలిసి ఒంటరిగా ఉం టున్నది. నాలుగు రోజుల క్రితం గుడిపెల్లిలోని ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న చిన్నమ్మ పద్మ ఇంటికి తన పిల్లలను తీసుకొని వచ్చింది. శుక్ర వారం అర్ధరాత్రి అందరితో కలిసి ఇంట్లో నిద్రి స్తున్న క్రమంలో ఒక్కసారిగా జరిగిన అగ్ని ప్రమా దంలో తన ఇద్దరి పిల్లలతో అగ్నికి ఆహుతి అ య్యింది. ఆదివారం స్వగ్రామానికి వెళ్లాలనుకుం ది. చుట్టపు చూపుగా వచ్చి తల్లీకూతుళ్లు మృత్యువాత పడడంపై స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్ కొండంపేటకు చేరుకొని పూర్తి వివరాలు సేక రించారు. మౌనిక ఇంటి నుంచి ఎప్పుడు వెళ్లింది, కుటుంబ పరిస్థితులు ఏమిటి తదితర విష యాలపై ఆరా తీశారు.
ప్రమాదం నుంచి తప్పించుకున్న వృద్ధులు
కోటపల్లి మండలం మల్లంపేట్ చెందిన బత్తుల లింగయ్య, కమల దంపతులు కొద్ది రోజుల క్రితం తమ కూతురైన పద్మ ఇంటికి వచ్చారు. ఇక్కడే ఉంటూ వ్యవసాయ పనుల్లో పాల్గొంటున్నారు. తరచూ తంబాకు తింటూ గోడలపై ఉమ్మేస్తున్నా వని పద్మ తండ్రి లింగయ్యను మందలించింది. దీంతో లింగయ్య తన భార్య కమలను తీసుకొని అదే గ్రామంలో ఉంటున్న బంధువైన భానయ్య ఇంటికి వెళ్లిపోయాడు. రాత్రి అక్కడే పడుకు న్నారు. తెల్లారిలేచే సరికి తన కూతురుతో పాటు అల్లుడు శివయ్య మరణించారని తెలిసి బోరున విలపించారు. పది, పదిహేను రోజుల క్రితం కూతురు ఇంటి బయట ఎవరో వచ్చినట్లు అలికిడి అయ్యిందని, అందరినీ నిద్ర లేపి బయటికి వెళ్లి చూశామని, ఆ రోజు తన బిడ్డను హెచ్చరించినా వినలేదని, ఈ రోజు ఇంతపనైతదనుకోలేదని పద్మ తల్లి కమల బోరున విలపించింది.
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం..ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్
అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. గుడిపెల్లిలో జరిగిన అగ్ని ప్రమాదస్థలాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఘటనకు సంబంధించిన విషయాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక ఎవరైనా కక్షతో నిప్పంటించారా అన్న కోణం లో పోలీసులు విచారణ వేగవంతం చేశారని ఆయన తెలిపారు. మరణించిన వారి ఆత్మకుశాంతి చేకూరాలని కోరారు. ఆయన వెంట జడ్పీటీసీ రవి, సర్పంచ్ తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.