కాసిపేట, ఫిబ్రవరి 24 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. బుధవారం ఫస్టియర్తో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షా కేంద్రంలో పరీక్షలకు సంబంధించిన అన్ని పనులను అధికారులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచారు. విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు మోడల్ కళాశాల ఇంటర్ విద్యార్థులు ఇక్కడి ఈ పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాయనున్నారు. జనరల్ గ్రూపుల విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాస్తారు. ఫస్టియర్ లో జనరల్ విద్యార్థులు 197, ఒకేషనల్ విద్యార్థులు 28 మంది మొత్తం 225 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సెకెండీయర్ లో 175, ఒకేషనల్ 17 మొత్తం 191 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరిడెండింట్గా సీహెచ్ రాజేశ్వరి, డిపార్ట్మెంట్ ఆఫీసర్గా ఈ. సోమయ్య విధులను నిర్వహించనున్నారు.