కోటపల్లి : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. టీఆర్ఎస్ యువ నాయకులు గారె రమేశ్ ఆధ్వర్యంలో మహిళలు పచ్చని పొలాల మద్య కేసీర్కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.
రైతున్న సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తున్న కేసీఆర్కు ‘జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్ సార్’ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు.
రైతులకు రైతుబంధు, ఉచిత విద్యుత్, రైతు కుంటుంబాలకు అండగా ఉండేందు కోసం రైతుబీమా, నిరుపేదల ఇంట్లో వివాహం కోసం కల్యాణ లక్ష్మి, దళిత కుటుంబాలలో వెలుగు కోసం దళిత బస్తీ, ఆసరా పింఛన్లు, గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి తదితర పథకాలను ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు చల్లంగా జీవించాలని దీవెనలిచ్చారు.