కాసిపేట, ఫిబ్రవరి 3 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయతీ నూతన భవనం, ఐకేపీ భవనాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ.30 లక్షలతో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ పనులను సర్పంచ్ పెంద్రం శంకర్, ఐకేపీ ఏపీఎం రాజ్ కుమార్ తో కలిసి మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్, సర్పంచ్ పెంద్రం శంకర్, ఆత్మ కమిటీ చైర్మన్ రౌతు సత్తయ్య, ఉప సర్పంచ్ రొడ్డ ప్రసన్న, రాజమౌలి, నందం, మైదం రమేష్, ఆల్క రాజు, వల్క చిలుకయ్య, మహంకాళి, ఎంబడి బక్కయ్య, వల్క రవి, సల్లూరి ప్రభాకర్, తోడేటి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.