శ్రీరాంపూర్ : తెలంగాణా ప్రభుత్వం ప్రారంభించిన గుడికో జమ్మిచెట్టు, ఊరికో జమ్మిచెట్టు కార్యక్రమాన్ని సింగరేణిలో గనికో జమ్మిచెట్టు కార్యక్రమాన్ని శుక్రవారం డైరెక్టర్(ఫైనాన్స్, పా, పీపీ) బలరాం ప్రారంభించారు. ఎంపీ సంతోష్రావు ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా సింగరేణి వ్యాప్తంగా హరితహారంలో మొక్కలు నాటారు. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం గుడికో జమ్మిచెట్టు, ఊరికో జమ్మిచెట్టు కార్యక్రమాన్ని కొనసాగింపుగా సింగరేణిలో గనికో జమ్మిచెట్టు కార్యక్రమాన్ని ఎంపీ సంతోష్రావు పీఏ పురుషోత్తంతో కలిసి శ్రీరాంపూర్ ఆర్కే 5గనిలోని వనంలో జమ్మిచెట్టు నాటారు . ఈ సందర్భంగా డైరెక్టర్ బలరాం మాట్లాడుతు తెలంగాణాలో అతిపెద్ద పండుగ దసరా రోజు విజయానికి చిహ్నాంగా ఉండే జమ్మిచెట్టును పూజించి ప్రజలు వేడుకలు జరుపుకుంటారని చెప్పారు.
అంతటి ప్రాముఖ్యత గల జమ్మిచెట్టు అంతరించి పోకుండా ఉండేందుకే తెలంగాణ ప్రభుత్వం జమ్మి చెట్లు పెంచాలని నిర్ణయించిందన్నారు. . సింగరేణిలో ప్రతీ గనిపై, మైసమ్మ దేవాలయాల ఆవరణాల వద్ద హరితహారంలో భాగంగా జమ్మిచెట్లు పెంచుతామన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బలరాం, ఎంపీ పీఏ పురుషోత్తం, జీఎం సివిల్ కార్పొరేట్ రమేశ్బాబులను సన్మానించారు. శ్రీరాంపూర్ టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, ఏరియా చర్చల ప్రతినిధులు వెంగళ కుమారస్వామి, పెట్టం లక్ష్మణ్, జీఎం కార్పొరేట్ స్వామినాయుడు, ఏజీఎం సుధాకర్, డీవైజీఎం ప్రసాద్, ఎన్విరాన్మెంట్ అమరేందర్రెడ్డి, డీవైజీఎం సివిల్ శివరావు, డీవైజీఎం రమేశ్, ఫారెస్ట్ ఆఫీసర్ రమణారెడ్డి, ఫిట్ కార్యదర్శులు మహేందర్రెడ్డి, సత్యనారాయణ, నీలం సదయ్య, నాయకులు ఆనందం, మల్లేశం పాల్గొన్నారు.