బజార్హత్నూర్, మే 11 : గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఎంపీపీ జయశ్రీ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గత సమావేశాల్లో తీర్మానం చేసిన పనుల స్థితిగతుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని పశువైద్యాశాలలో మందుల కొరత ఉందని పశువైద్యాధికారి పర్వేజ్ హైమద్ సభ దృష్టికి తీసుకువచ్చారు.
మండల వ్యవసాయధికారి ప్రమోద్రెడ్డి మాట్లాడుతూ రైతులకు వానకాలం సీజన్లో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండలంలో నకిలీ విత్తనాల అమ్మినట్లు తెలిస్తే వ్యవసాయధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీపీ సంబంధిత అధికారులకు సూచించారు. అంతేకాకుండా పలు శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. సమావేశంలో తహసీల్దార్ కూన గంగాధర్, ఎంపీడీవో మహేందర్రెడ్డి, జడ్పీటీసీ నర్సయ్య, పీఆర్ఏఈ నారాయణ, అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.