మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు
దండేపల్లి మండలంలో పర్యటన
రోడ్లు, బ్రిడ్జిలు, పంటల పరిశీలన
దండేపల్లి, జూలై 25 : భారీ వర్షాలకు నష్టపోయిన వారిని అన్ని వి ధాలా ఆదుకుంటామని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. మండలంలోని రెబ్బెన్పెల్లి, లక్ష్మీకాంతాపూర్, బిక్కనగూడ, ద్వారక, కొండాపూర్, కాసిపేట గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. రెబ్బెన్పెల్లి-ముత్యంపేట వాగుపై తెగిన తాత్కాలిక రో డ్డును పరిశీలించి, త్వరగా మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.అలాగే గోదావరి తీర గ్రామాల్లో పడిపోయిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, పంటలను పరిశీలించారు. రెండు రోజుల్లోగా నూతన స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఎస్ఈకి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరూ కూడా అధైర్యపడవద్దని ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, టీఆర్ఎస్ నా యకులు బండారి మల్లేశ్, ముత్తె రాజన్న, కందుల అశోక్, బత్తుల శేఖర్, విఠల్, జాడి ఇసాకర్, బాదినేని నారాయణ, రెంక అనిల్, కొ ట్టె సత్తయ్య, ఫయాజ్, అఫ్సర్, సత్యాగౌడ్, శంకర్రావు, మైదం గం గారెడ్డి, కొడపర్తి గంగాధర్, బండ రాకేశ్, తదితరులు ఉన్నారు.
వాంకిడి మండలంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు పర్యటన..
ఆసిఫాబాద్ (వాంకిడి), జూలై 25 : వాంకిడి మండలంలోని దాబా, సవతి, నౌదారి గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే ఆత్రం సక్కు పర్యటించారు. భారీ వర్షాలతో తెగిపోయిన బ్రిడ్జిలు, రోడ్లను పరిశీలించారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పంటల నష్టంపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీనిచ్చారు. ఆయన వెంట జడ్పీటీసీ అజయ్, సింగిల్విండో చైర్మన్ పెంటు, సర్పంచ్లు సు మిత్ర జంగు, దేవ్రావ్, జంగు, జైరాం, ఉపసర్పంచ్ భీంరావు, డీఈ ఈ ఆనంద్, ఏఈఈ స్టీవెన్, తహసీల్దార్, ఎంపీడీవో ఉన్నారు.