దిలావర్పూర్ ఏప్రిల్ 8 : సర్కారు బడులు అంటేనే… మొండి గోడలు.. విరిగిన బెంచీలు.. చినిగిన దుస్తులు, పాఠ్య పుస్తకాలు.. ఒకప్పటి సర్కారు బడులు ముచ్చట ఇది.. కానీ తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడుల్లో చదువుకునే విద్యా ర్థులకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నది. సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేప ట్టారు. విడుతల వారీగా నిధులను కేటాయిం చడంతో సర్కారు బడుల దశ మారింది. మండ లంలో మొదటి విడుతలో భాగంగా దిలావర్ పూర్ ప్రాథమిక పాఠశాలకు రూ.44 లక్షలతో నూతన భవనం, గుండంపల్లి ప్రాథమిక పాఠశా లకు రూ. 4 లక్షలు, కాల్వతండా పాఠశాలకు రూ. 2 లక్షల 55 వేలు, బన్సపల్లి ప్రాథమిక పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి రూ.22 లక్షలను సర్కారు మంజూరు చేసింది. బన్సపల్లి, కాల్వ తండా గ్రామాల్లోని పాఠశాలల పనులు పూర్తి అయ్యాయి. కార్పొరేట్ స్థాయిని తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు.
డెస్కు బెంచీలు.. తరగతి గదుల్లో సౌకర్యాలు
మన ఊరు మన బడి ద్వారా విద్యార్థులకు డెస్క్ బెంచీలు, గ్రీన్ బోర్డులు. ఉపాద్యాయులుకు కూర్చోవడానికి కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రతి తరగతి గదికి ఫ్యాన్, విద్యుత్ సౌకర్యంతో పాటు, అవసరమైన టీఎల్ఎం మెటీ రియల్ను అందించింది. దీంతో పాటు విద్యార్థుల కు ఆకట్టుకునేలా అందమైన రంగులతో పాటు అందమైన బొమ్మలను వేయించారు. అదే విధం గా తాగునీటి సౌకర్యంతోపాటుమరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజన సమ యం లో విద్యార్థులు చేతులు కడుక్కోవడానికి నల్లాలను ఏర్పాటు చేశారు. సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దారు.
ముందే పుస్తకాలు, దుస్తులు..
ఒకప్పుడు ఒక సంవత్సరం చదువుకున్న పుస్తకాలను, మరో తరగతి నుంచి వచ్చిన విద్యా ర్థులకు ఇచ్చేవారు. కానీ పాఠశాల విద్యా సంవ త్సరానికి ముందే ప్రభుత్వం విద్యార్థులకు కావాల్సిన పాఠ్యపుస్తకాలు, వారికి కావాల్సిన రెండు జతల దుస్తులను అందిస్తున్నది. విద్యకు సర్కారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది.
విద్యార్థుల సంఖ్య పెరిగింది..
ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు మన బడి ద్వారా మౌలిక వసతులు కల్పించడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. కాల్వ తండ ప్రాథమిక పాఠశాలలో ఒకప్పుడు 20 మంది ఉన్న పాఠశాల నేడు 86 మందితో తరగతులు నడుస్తున్నాయి. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు సహకరించ డంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. మరింత పెరిగే అవకాశం ఉంది.
– శంకర్ ఎంఈవో(దిలావర్పూర్)
రోజూ బడికి వెళ్తున్నా..
నేను రోజు బడికి పోతున్న. ఇంతకు ముందు బడికి పోవాలంటే భయ పడుతుంటి. కింద దుబ్బలో కూర్చోవడం ఇబ్బందిగా ఉండేది. మూడు నెలల క్రితం మా ఊరు బడిని మంచిగా చేపిచ్చినారు. ప్రైవేట్ బడిలో ఉన్న విదంగా డెస్క్ బెంచీలు, ఫ్యాన్లు, అందమైన బొమ్మలను గీయించారు. భోజనం బాగా పెడుతున్నారు. రోజూ బడికి పోతున్నాను.
– గడ్డం లౌక్య 3వ తరగతి(బన్సపల్లి)