ఎదులాపురం, డిసెంబర్ 1 : మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులు వేగవంతం చేయాలని, మోడల్ స్కూల్ పనులు వారంలోగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులపై గురువారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంజినీరింగ్ శాఖల అధికారుల ఆధ్వర్యంలో చేపడుతున్న మన ఊరు-మన బడి పనులు పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తి చేయాలని, చేపట్టిన పనుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు 37 మోడల్ స్కూళ్ల కు గానూ 25 పాఠశాలల పనులు పూర్తి కాగా మిగతా పనులు ఈ వారంలోగా పూర్తి చేయాల న్నారు. మోడల్ స్కూల్ ప్రారంభో త్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఉపాధి హామీ పనులకు సంబంధించిన పనులపై ప్రత్యేక చర్యలు చేపడుతూ రానున్న పది రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు. అవసరమైన సిమెంట్ను సమకూర్చు కోవాలని, పాఠశాలల పెయింట్కు సంబంధించిన వివరాలు రికార్డు చేయాలని ప్కేన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ ఈజీఎస్ పనులకు మళ్లీ అంచ నాలు రూపొందించాలని సూచించారు. మన ఊరు-మన బడి కింద చేపడుతున్న టెండర్, ఇతర పనులకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, అదనపు డీఆర్డీవో రవీందర్ రాథోడ్, సెక్టోరల్ అధికా రులు నారాయణ, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, సాంఘిక సంక్షేమ శాఖల ఇంజి నీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఆధార్ కలిగి ఉండాలని, పూర్తి సమాచారం నవీకరణ చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో యూఐడీఏఐ జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం నుంచి ఆధార్ ఆప్డేట్ చేసుకోని వారు నవీకరణ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. అలాగే 5 నుంచి 10 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ తప్పనిసరిగా ఆధార్ నవీకరణ చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ 10 సంవత్సరాలకు ఒకసారి తప్పనిగా బయోమెట్రిక్ నవీకరణ చేసుకోవాల్సిన అవశ్యకత ఉందన్నారు. యూఐడీఏఐ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ అసిస్టెంట్ మేనేజర్ మహ్మద్ సౌభన్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండ లాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రజల సౌకర్యార్థం అందుబాటులో ఉంచాలని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఆధార్ తప్పని సరిగా ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ వివరాలు ఆధార్ కార్డులో నవీకరణ చేసు కోవాలని కోరారు. అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలు నిర్వహించే సమావేశాల్లో ఆధార్ నవీకరణపై వివరించాలని సూచించారు. ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ చేసుకో వాలని తెలిపారు. అనంతరం ఆధార్ నవీకరణకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ విడుదల చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాస్రావు, ఆర్డీవో రాథోడ్ రమేశ్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని సాధన, ఎల్డీఎం, ఈ-జిల్లా మేనేజర్ రవి, తపాలా శాఖ అధికారులు పాల్గొన్నారు.