కుభీర్ : ఆడపడుచుల పెళ్లిళ్లకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి ( Kalyana Laxmi ) పథకం ద్వారా అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ( MLA Rama Rao Patel ) సూచించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ఆయా గ్రామాలకు చెందిన 80 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 160 దరఖాస్తులకు క్లియరెన్స్ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో భీమేష్, స్థానిక సర్పంచ్ కందూరి సాయినాథ్, నాయకులు బోయిడి విట్టల్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మారుతి, ఆయా గ్రామాల నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.