కుభీర్, ఏప్రిల్ 30 : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె), ధార్కుభీర్, నిగ్వ గ్రామాల్లో కోతకోసి కుప్పలు పోసి నూర్పిడి చేస్తే చేతికొచ్చే మొక్కజొన్న పంట షార్ట్ సర్క్యూట్ వల్ల గురువారం 21 మంది రైతులకు చెందిన మొక్కజొన్న 43 ఎకరాల్లో కాలిబూడిదైంది. ఎండ తీవ్రతతోపాటు బలమైన గా లులు వీస్తుండడంతో ఒకరి చేను నుంచి మరొకరి చే నుకు మంటకు వ్యాపించాయి. పార్డి(కె)లో కొరండ్ల నర్సయ్య, కొరండ్ల ఓం ప్రకాశ్, మెంచు పోశెట్టి, శీలేవార్ తిరుపతి, మహబూబ్, తిర్మన్పెల్లి సంబాజీ, అహ్మద్, యాసిన్, నిగ్వలో దొంతుల భోజన్నలకు చెందిన మక్క పంటలు దగ్ధమయ్యాయి.
ధార్ కుభీర్లోని ఏడుగురు రైతులకు చెందిన 15.20 ఎకరాల్లోని పంట కాలి బూడిదైంది. అగ్ని మాపక శకటం భైంసా నుంచి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చా రు. మొత్తం ఆస్తి నష్టం రూ.26.72 లక్షలుగా అంచ నా వేసినట్లు ఎమ్మారై నరేశ్ తెలిపారు. సర్పంచులు బందెల సత్యనారాయణ, తోకల మారుతి, ఎస్సై శ్రీనివాస్, ఏఈవో నారాయణ చేలను పరిశీలించారు.
ముథోల్, ఏప్రిల్ 30 : తరోడా గ్రామ శివారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 12 ఎకరాల మొక్కజొన్న దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. చేతికొచ్చిన ఐదెకరాలు, నిజామొద్దీన్ 3, సికిందర్ ఖాన్ 2, ఏయఖాన్ 2 ఎకరాల పంట కాలిబూడిదైనట్లు వివరించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.