ఇంద్రవెల్లి, జనవరి 30 : యువత గాంధీజీ చూపిన బాటలో నడవాలని జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ అమ్జద్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని హెల్ప్ వీల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం మహాత్మా గాంధీ వర్ధంతి నిర్వహించారు. నాయకులు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కోఆర్డినేటర్ షేక్ సుఫియాన్, ఎంపీటీసీ ఆశాబాయి, మాజీ ఎంపీటీసీ సత్యానంద్, మాజీ సర్పంచ్ సుంకట్రావ్, హెల్ప్ వీల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అతిశ్, భాస్కర్, నాయకులు దేవ్పూజే మారుతి, సాయినాథ్, భరత్, సంతోష్ పాల్గొన్నారు.
భీంపూర్, జనవరి 30 : మండలంలోని పిప్పల్కోటి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు గాంధీజీ చిత్రపటానికి పూలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు కాల్వల శంకర్, సర్పంచ్ కళ్యాణి, ఉపసర్పంచ్ సుభాష్ పాల్గొన్నారు.
ఇచ్చోడ, జనవరి 30 : సిరికొండలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్లో మహాత్మాగాంధీ వర్ధంతి నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రాంప్రసాద్, ఉపాధ్యాయులు స్వాతి, సునీత, పరమేశ్వరి, సంపూర్ణ, విజయ పాల్గొన్నారు.
అమరజవానులకు నివాళి
భీంపూర్, జనవరి 30 : భీంపూర్, ధనోరా అందర్బంద్, టేకిడిరాంపూర్, కరంజి(టీ) గ్రామాల్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ, దేశం కోసం ప్రాణాలర్పించిన సమరయోధులకు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు నివాళులర్పించారు. కుష్ఠు నివారణపై అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు పెండెపు కృష్ణయాదవ్, మడావి లింబాజీ , రేఖ, స్వాతిక , ఉపసర్పంచ్లు ఆకటి లక్ష్మీబాయి, జాదవ్ రవీందర్, మాధవ్రావు, పంచాయతీ కార్యదర్శులు నితిన్, నరేశ్, జలంధర్, సిబ్బంది గంగాధర్, లూసి సుజాత ,దివ్య, వివేక్, విజయలక్ష్మి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
గాంధీజీ సేవలు మరువలేనివి
ఉట్నూర్, జనవరి 30 : గాంధీజీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో తిరుమల, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.