జైపూర్, మార్చి 10 :త్రిని మహాశివరా పురస్కరించుకుని వేలాలలో మూడు రోజులపాటు నిర్వహించిన జాతర ఆదివారంతో ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారికి పట్నాలు వేసి.. బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. పారిశుధ్య పనులపై ఎంపీడీవో గడ్డం సత్యనారాయణ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
చెన్నూర్ రూరల్, మార్చి 10 : కత్తెరశాల గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఆదివారం ముగిసింది. భక్తులు బోనాలు పోసి తీపి పదార్థాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు. పట్నాలు వేసి.. మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో రవి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. చెన్నూర్ సీఐ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.